thumbnail

ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ బుక్స్- జూలై 15లోగా అందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశం - Free Text Books for Inter Students

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 10:19 AM IST

Free Text Books Distribution for Inter Students in AP : ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 11, 12 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో హైస్కూల్ ప్లస్​ల్లో చదివే వారికి ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనుంది. తద్వారా ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 1,08,619 మంది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే 92,134 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

AP Govt on Free Books in Inter Students : ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్, బ్యాగ్​లను కూడా తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్​ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా సమగ్ర శిక్షా డైరెక్టర్​కు ఆదేశాలిచ్చింది. జులై 15లోగా విద్యార్ధులందరికీ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.