కొనసాగుతున్న అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర - Amaravati Farmers Padayatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 3:11 PM IST

thumbnail
కొనసాగుతున్న అమరావతి రైతుల 'కృతజ్ఞత పాదయాత్ర'- నాగులుప్పలపాడులో పూలతో స్వాగతం (ETV Bharat)

Amaravati Farmers Padayatra: రాజధాని రైతులు అమరావతి నుంచి తిరుమలకు చేపట్టిన 'కృతజ్ఞత పాదయాత్ర' ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. నాగులుప్పలపాడులో రాజధాని రైతులకు స్థానికులు, మహిళలు పూలతో స్వాగతం పలికారు. వర్షంలో కూడా రైతులు తమ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఉదయం నాగులుప్పలపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఒంగోలు మీదుగా సాగనుంది. జై అమరావతి, జైజై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ రైతులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధికి అడుగులు పడడంతో మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వెళ్తున్నట్లు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. రోజూ 25 నుంచి 30 కిలోమీటర్ల చొప్పున నడుస్తున్నట్లు చెప్పారు. 

"రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే మా ఆకాంక్ష తీరింది. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు మేం కృతజ్ఞత పాదయాత్ర చేపట్టాం. దీంతోపాటు గతంలో మా పాదయాత్ర సమయంలో మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం." - రైతులు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.