న్యాయం చేస్తానని హామీ ఇచ్చి మోసం - అగ్రిగోల్డ్ బాధితుల నిరసన - Agrigold Victims
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 13, 2024, 7:38 PM IST
Agrigold Victims Protest in Anakapalli District : గత ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ సంస్థ వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేస్తానని హమీ ఇచ్చిన సీఎం జగన్, అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేపట్టారు. సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్ల అవుతున్నా తమ గురించి ఆలోచించడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు