ETV Bharat / state

ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిన వైఎస్సార్సీపీ సర్కార్ - కూటమి ప్రభుత్వపైనే ఆశలు - YSRCP Govt on Irrigation Projects

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 8:48 AM IST

YSRCP Govt Neglect on Irrigation Projects: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. గడిచిన ఐదేళ్లలో ఏ ప్రాజెక్టు మరమ్మతులకూ నిధులు కేటాయించకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహణను గాలికొదిలేసింది. మూడేళ్ల కిందట అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 38 మంది మృత్యువాత పడగా ఐదు ఊర్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో వైఎస్సార్ జిల్లాలోని పలు జలాశయాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

YSRCP Govt on Irrigation Projects
YSRCP Govt on Irrigation Projects (ETV Bharat)

Projects Repairs Ignored in YSR District : తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఏపీలోని జలాశయాల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూడేళ్ల కిందట అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషాధ ఘటనను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2021 నవంబర్ 19న సంభవించిన భారీ వరదలకు తోడు వైఎస్సార్సీపీ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో పింఛ, అన్నమయ్య జలాశయాలు కొట్టుకుపోయాయి.

Irrigation Projects in AP : తెల్లారకముందే ఐదూర్లు నేలమట్టం అయ్యాయి. 38 మందిని బలితీసుకున్న విషాద ఘటన అది. ఘటన జరిగిన తర్వాత మూడేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేకపోయింది. పునరావాసం మాట దేవుడెరుగు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోని మరికొన్ని జలాశయాల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది.

YSRCP Govt on Projects Repairs : జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడం, గేట్ల పైభాగం, వంతెన పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే కాకుండా బద్వేల్ నియోజకవర్గంలోని దిగువ సగిలేరు గేటు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి ప్రాజెక్టు స్పిల్ వే దెబ్బతింది. చాలావరకు కోతకు గురైంది.

ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్‌ : కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మరింత ఘోరం. ప్రాజెక్టు నాణ్యతా లోపం కారణంగా ఎక్కడ చూసినా లీకేజీలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం అయితే సమీపంలోని గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులపై అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గత ఐదేళ్లలో వీటికి ఎన్ని నిధులు కేటాయించారు వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

"ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదు. దిగువ సగిలేరు ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అయినా వాటిని గుర్తించేందుకు నిధులు విడుదల చేయలేదు. అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. వారికి ఇంతవరకూ పునరావాసం కల్పించలేదు. పంట కాలువలు కానీ ప్రాజెక్టులకు మరమ్మతులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో వీటికి ఎన్ని నిధులు కేటాయించారు. వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం." - చంద్ర, సీపీఐ నేత

చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం : వైఎస్సార్ జిల్లాలోని జలాశయాల పర్యవేక్షణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టుల గేట్లకు గ్రీసు పూయడానికి కూడా నిధులు విడుదల చేయలేదని జిల్లా ప్రజలు అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వారు కోరుతున్నారు.

"ఈ ఐదు సంవత్సారాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణను పట్టించుకోలేదు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఈ ప్రభావం రాయలసీమపై కూడా ఉంది. వైఎస్సార్ జిల్లాలోని జలాశయాల పర్యవేక్షణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం." - మాధవీరెడ్డి, కడప ఎమ్మెల్యే

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు

Projects Repairs Ignored in YSR District : తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఏపీలోని జలాశయాల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూడేళ్ల కిందట అన్నమయ్య జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషాధ ఘటనను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. 2021 నవంబర్ 19న సంభవించిన భారీ వరదలకు తోడు వైఎస్సార్సీపీ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో పింఛ, అన్నమయ్య జలాశయాలు కొట్టుకుపోయాయి.

Irrigation Projects in AP : తెల్లారకముందే ఐదూర్లు నేలమట్టం అయ్యాయి. 38 మందిని బలితీసుకున్న విషాద ఘటన అది. ఘటన జరిగిన తర్వాత మూడేళ్ల పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేయలేకపోయింది. పునరావాసం మాట దేవుడెరుగు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోని మరికొన్ని జలాశయాల పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది.

YSRCP Govt on Projects Repairs : జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం జలాశయం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. జలాశయం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడం, గేట్ల పైభాగం, వంతెన పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే కాకుండా బద్వేల్ నియోజకవర్గంలోని దిగువ సగిలేరు గేటు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పులివెందుల నియోజకవర్గంలోని చిత్రావతి ప్రాజెక్టు స్పిల్ వే దెబ్బతింది. చాలావరకు కోతకు గురైంది.

ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్‌ : కమలాపురం నియోజకవర్గంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిస్థితి మరింత ఘోరం. ప్రాజెక్టు నాణ్యతా లోపం కారణంగా ఎక్కడ చూసినా లీకేజీలే దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం అయితే సమీపంలోని గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల మరమ్మతులపై అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. గత ఐదేళ్లలో వీటికి ఎన్ని నిధులు కేటాయించారు వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

"ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోలేదు. దిగువ సగిలేరు ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. అయినా వాటిని గుర్తించేందుకు నిధులు విడుదల చేయలేదు. అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. వారికి ఇంతవరకూ పునరావాసం కల్పించలేదు. పంట కాలువలు కానీ ప్రాజెక్టులకు మరమ్మతులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో వీటికి ఎన్ని నిధులు కేటాయించారు. వాటిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం." - చంద్ర, సీపీఐ నేత

చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం : వైఎస్సార్ జిల్లాలోని జలాశయాల పర్యవేక్షణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రాజెక్టుల గేట్లకు గ్రీసు పూయడానికి కూడా నిధులు విడుదల చేయలేదని జిల్లా ప్రజలు అంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వారు కోరుతున్నారు.

"ఈ ఐదు సంవత్సారాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్వహణను పట్టించుకోలేదు. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఈ ప్రభావం రాయలసీమపై కూడా ఉంది. వైఎస్సార్ జిల్లాలోని జలాశయాల పర్యవేక్షణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం." - మాధవీరెడ్డి, కడప ఎమ్మెల్యే

వరదల ధాటికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.