ETV Bharat / state

'మీరు లేని లోకంలో ఉండలేను - మీ వెంటే నేను'

భర్త, పిల్లల మృతిని తట్టుకోలేక మహిళ బలవన్మరణం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

WOMAN_SUICIDE_HER_HUSBAND_DEATH
WOMAN_SUICIDE_HER_HUSBAND_DEATH (ETV Bharat)

Woman Died Violently Unable To Bear Death Husband And Children : ఆమెకు తన కుటుంబమే లోకం. కంటికి రెప్పలా చూసుకునే భర్త. ముత్యాల్లాంటి బిడ్డలతో అన్యోన్యంగా జీవించేవారు. చేతికి అందివస్తున్న పిల్లలను చూసి మురిసిపోయింది. ఇలా ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతున్న తరుణంలో కాలవ రూపంలో కాలం అన్యాయం చేసింది. పెంపుడు కోడితో సరదాగా కాలువలో దిగి భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి అయ్యారు. ఈ సంఘటనతో తల్లడిల్లిపోయిన ఆమె ఇంట్లో ఉరేసుకొని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంటికెళ్దాం లే కన్నయ్యా - మృతి చెందిన కుమారుడి పక్కన తల్లి రోదన

పెదవేగి మండలం కవ్వకుంటలో గ్రామంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), దేవి (36) దంపతులు నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా పందెం కోళ్లను పెంచి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుమారులు మణికంఠ (15), సాయికుమార్‌ (13) పందెం కోడితో ఈత కొట్టించడానికి బుధవారం (అక్టోబర్​ 9న) పోలవరం కుడి కాలువకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా నీటిలో దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఇద్దరు కుమారులను రక్షించడం కోసం నీటిలో దిగిన వెంకటేశ్వరరావు కూడా జలసమాధి అయిపోయారు. ఒకే సంఘటనలో భర్త, పిల్లలు దూరం అయిన విషయాన్ని దేవి జీర్ణించుకోలేకపోయింది. వారినే తలచుకుంటూ 2 రోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే కుటుంబమంతా తనువు చాలించడంతో కవ్వకుంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide

Woman Died Violently Unable To Bear Death Husband And Children : ఆమెకు తన కుటుంబమే లోకం. కంటికి రెప్పలా చూసుకునే భర్త. ముత్యాల్లాంటి బిడ్డలతో అన్యోన్యంగా జీవించేవారు. చేతికి అందివస్తున్న పిల్లలను చూసి మురిసిపోయింది. ఇలా ఆమె జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతున్న తరుణంలో కాలవ రూపంలో కాలం అన్యాయం చేసింది. పెంపుడు కోడితో సరదాగా కాలువలో దిగి భర్త, ఇద్దరు పిల్లలు జలసమాధి అయ్యారు. ఈ సంఘటనతో తల్లడిల్లిపోయిన ఆమె ఇంట్లో ఉరేసుకొని తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంటికెళ్దాం లే కన్నయ్యా - మృతి చెందిన కుమారుడి పక్కన తల్లి రోదన

పెదవేగి మండలం కవ్వకుంటలో గ్రామంలో శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (50), దేవి (36) దంపతులు నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా పందెం కోళ్లను పెంచి అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుమారులు మణికంఠ (15), సాయికుమార్‌ (13) పందెం కోడితో ఈత కొట్టించడానికి బుధవారం (అక్టోబర్​ 9న) పోలవరం కుడి కాలువకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరుగా నీటిలో దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఇద్దరు కుమారులను రక్షించడం కోసం నీటిలో దిగిన వెంకటేశ్వరరావు కూడా జలసమాధి అయిపోయారు. ఒకే సంఘటనలో భర్త, పిల్లలు దూరం అయిన విషయాన్ని దేవి జీర్ణించుకోలేకపోయింది. వారినే తలచుకుంటూ 2 రోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే కుటుంబమంతా తనువు చాలించడంతో కవ్వకుంట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

'మేమేం చేశాం అమ్మా' - ఇద్దరు చిన్నారులతో కాలువలోకి దూకిన తల్లి - Mother Commits Suicide

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.