ETV Bharat / state

రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన - ప్రజా ప్రభుత్వం గుర్తుండిపోయేలా అభివృద్ధి : సీఎం రేవంత్​ - Musi Riverfront Development Project

Telangana Govt to Take up Musi Riverfront Development : హైదరాబాద్​కు తలమానికంగా నిలిచే మూసీ నది అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1.50 లక్షల కోట్ల రూపాయలతో మూసీ నది అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పదేళ్లలో మూసీనదిని చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకురావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 9:18 PM IST

Telangana Govt to Take up Musi Riverfront Development
CM Revanth Focus On Musi River Development (ETV Bharat)

CM Revanth Focus On Musi River Development : హైటెక్ సిటీ చూస్తే నారా చంద్రబాబునాయుడు, అంతర్జాతీయ విమానాశ్రయం చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పదేళ్ల తర్వాత మూసీ నది చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​కు తలమానికంగా నిలిచే మూసీ నదిని లక్షా 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి, లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్​పల్లి తండా వద్దా 28 కోట్ల రూపాయలతో నిర్మించిన పై వంతెనను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జెండా ఊపి ఉమెన బైకర్స్​ను ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి అనుమతించారు.

మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి : మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు వంతెన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి అభివృద్ధికి గోపన్​పల్లి పైవంతెన దోహదపడుతుందన్న ముఖ్యమంత్రి, శేరిలింగంపల్లి వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"మూసీ నదీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి, త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. నేడు మూసీ అంటే మనమందరం ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసీ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా అభివృద్ధి చేపడతాం."- రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Congress Govt Focus Hyderabad Development : హైదరాబాద్​ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, వచ్చే పదేళ్లలో హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. గోపన్​పల్లికి రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. వర్షంలోనూ చాలా సేపు తన కోసం నిరీక్షించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కొత్త ఫైఓవర్ మీదుగానే తన కాన్వాయ్​లో తిరిగి వెళ్లిపోయారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్​ ఒక బ్రాండ్ - ఆ అలవాటు ఆయన నుంచే నేర్చుకున్నా : సీఎం రేవంత్ - Kamma Global Federation Summit

తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే : సీఎం రేవంత్​ రెడ్డి - tg CM Inaugurate Gopanpally Flyover

CM Revanth Focus On Musi River Development : హైటెక్ సిటీ చూస్తే నారా చంద్రబాబునాయుడు, అంతర్జాతీయ విమానాశ్రయం చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే పదేళ్ల తర్వాత మూసీ నది చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​కు తలమానికంగా నిలిచే మూసీ నదిని లక్షా 50 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి, లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు మూసీని సందర్శించేలా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్​పల్లి తండా వద్దా 28 కోట్ల రూపాయలతో నిర్మించిన పై వంతెనను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జెండా ఊపి ఉమెన బైకర్స్​ను ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి అనుమతించారు.

మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి : మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సహా స్థానిక ప్రజాప్రతినిధులు వంతెన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి అభివృద్ధికి గోపన్​పల్లి పైవంతెన దోహదపడుతుందన్న ముఖ్యమంత్రి, శేరిలింగంపల్లి వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

"మూసీ నదీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి, త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. నేడు మూసీ అంటే మనమందరం ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది. కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసీ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా అభివృద్ధి చేపడతాం."- రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Congress Govt Focus Hyderabad Development : హైదరాబాద్​ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, వచ్చే పదేళ్లలో హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. గోపన్​పల్లికి రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. వర్షంలోనూ చాలా సేపు తన కోసం నిరీక్షించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కొత్త ఫైఓవర్ మీదుగానే తన కాన్వాయ్​లో తిరిగి వెళ్లిపోయారు.

రాజకీయాల్లో ఎన్టీఆర్​ ఒక బ్రాండ్ - ఆ అలవాటు ఆయన నుంచే నేర్చుకున్నా : సీఎం రేవంత్ - Kamma Global Federation Summit

తెలంగాణకు 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే : సీఎం రేవంత్​ రెడ్డి - tg CM Inaugurate Gopanpally Flyover

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.