ETV Bharat / state

'ఓఆర్ఆర్ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే - త్వరలో మార్గదర్శకాలు' - Tg CS Review on Hydra demolitions

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 4:28 PM IST

Hydra demolitions in Hyderabad : ఓఆర్​ఆర్​ పరిధిలోని ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత హైడ్రాదేనని సీఎస్​ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, విధివిధానాలను తయారు చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు.

Telangana CS Shanti Kumari Review on Hydra
Telangana CS Shanti Kumari Review on Hydra (ETV Bharat)

Telangana CS Shanti Kumari Review on Hydra : ఓఆర్​ఆర్​ పరిధిలో జలాశయాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా హైడ్రా పరిధిలోకి తీసుకు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్​ ఆదేశించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు సీఎస్​ తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో సీఎస్​ సమావేశం నిర్వహించారు.

హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, ఇరిగేషన్​, తదితర వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్​ పేర్కొన్నారు. ఓఆర్​ఆర్​ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు.

ఎఫ్​టీఎల్​, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే : ఎఫ్​టీఎల్​, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్​ సాగర్​ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన 72 బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీసు, సర్వే, ఇరిగేషన్​ తదితర శాఖలకు అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్​ డీజీ శివధర్​ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్​ భగవత్​, పురపాలక, నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్​, రాహుల్​ బొజ్జా, హెచ్​ఎండీఏ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​, అదనపు అడ్వకేట్​ జనరల్​ రజనీకాంత్​ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్​ తరణ్ జోషి, హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Telangana CS Shanti Kumari Review on Hydra : ఓఆర్​ఆర్​ పరిధిలో జలాశయాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా హైడ్రా పరిధిలోకి తీసుకు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్​ ఆదేశించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు సీఎస్​ తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో సీఎస్​ సమావేశం నిర్వహించారు.

హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, ఇరిగేషన్​, తదితర వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్​ పేర్కొన్నారు. ఓఆర్​ఆర్​ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు.

ఎఫ్​టీఎల్​, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే : ఎఫ్​టీఎల్​, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్​ సాగర్​ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన 72 బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీసు, సర్వే, ఇరిగేషన్​ తదితర శాఖలకు అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్​ డీజీ శివధర్​ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్​ భగవత్​, పురపాలక, నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్​, రాహుల్​ బొజ్జా, హెచ్​ఎండీఏ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​, అదనపు అడ్వకేట్​ జనరల్​ రజనీకాంత్​ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్​ తరణ్ జోషి, హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

ఎవరైతే మాకేంటి? - సీఎం సోదరుడికి 'హైడ్రా' షాక్ - నెలలోగా ఇల్లు కూల్చేయాలని అల్టిమేటమ్ - Hydra Notices To CM Revanth Brother

ఓఆర్‌ఆర్‌ ఆవలకూ హైడ్రా బుల్డోజర్లు! - విస్తరణ దిశగా సర్కార్​ అడుగులు - State Govt Plan To HYDRA Expansion

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.