ETV Bharat / state

ప్రయాణికులకు అలర్ట్ - 11 రోజుల పాటు 78 రైళ్లు రద్దు - 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లింపు - 78 TRAINS CANCELLED IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 10:42 AM IST

78 Trains Cancelled in Kazipet - Ballarsha Section: దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో 78 రైళ్ల రద్దు చేయనున్నట్లు దక్షణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 26 ఎక్స్‌ప్రెస్‌ల దారి మళ్లించనున్నట్లు పేర్కొంది.

South Central Railway
South Central Railway (ETV Bharat)

78 Trains Cancelled in Kazipet - Ballarsha Section Details : దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. రైల్వే పనుల కారణంగా పలు రైల్లను రద్దు చేయడమే కాకుండా, మరి కొన్ని రైళ్ల రూటునూ మార్చినట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.

ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మెుత్తం 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రైళ్ల వివరాలను దక్షణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఒక్క ట్రైన్ టికెట్ - 56 రోజుల వ్యాలిడిటీ - దేశం మొత్తం చుట్టేసి రావచ్చు! - Circular Journey Ticket Advantages

రద్దయిన రైళ్లు వివరాలు:

కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు

పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న

కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న

హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌ (నం.02575) జూన్‌ 28న,

గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న

ముజఫర్‌పుర్‌-సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న,

సికింద్రాబాద్‌-ముజఫర్‌పుర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న

గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న,

జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304) రైళ్లు జులై 1న

సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో..

సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో..

సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

దారి మళ్లించిన రైళ్లు : తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ఆయా తేదీల్లో దారి మళ్లించి నడిపించాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూదిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. కాజీపేటతో పాటుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు.

న్యూదిల్లీ - సికింద్రాబాద్‌ (నం. 12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (దిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.

ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్​ప్రెస్ రైలు పునరుద్ధరణ

78 Trains Cancelled in Kazipet - Ballarsha Section Details : దక్షిణ మధ్య రైల్వేజోన్‌ పరిధిలోని పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. రైల్వే పనుల కారణంగా పలు రైల్లను రద్దు చేయడమే కాకుండా, మరి కొన్ని రైళ్ల రూటునూ మార్చినట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.

ఆసిఫాబాద్‌-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మెుత్తం 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రైళ్ల వివరాలను దక్షణమధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కనిష్ఠంగా ఒక రోజు నుంచి గరిష్ఠంగా 11 రోజుల పాటు రైళ్లు రద్దు కానున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఒక్క ట్రైన్ టికెట్ - 56 రోజుల వ్యాలిడిటీ - దేశం మొత్తం చుట్టేసి రావచ్చు! - Circular Journey Ticket Advantages

రద్దయిన రైళ్లు వివరాలు:

కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (నం.12757/12758) జూన్‌ 26 నుంచి జులై 6 వరకు

పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (నం.22151) ఈ నెల 28, జులై 5న

కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్‌ (నం.22152) జూన్‌ 30, జులై 7న

హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌ (నం.02575) జూన్‌ 28న,

గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌ జులై 30న

ముజఫర్‌పుర్‌-సికింద్రాబాద్‌ (నం.05293) జులై 2న,

సికింద్రాబాద్‌-ముజఫర్‌పుర్‌ (నం.05294) జూన్‌ 27, జులై 4న

గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న,

జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304) రైళ్లు జులై 1న

సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్‌ 26, 27, 28 తేదీల్లో..

సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో..

సికింద్రాబాద్‌-సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు జూన్‌ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.

దారి మళ్లించిన రైళ్లు : తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను ఆయా తేదీల్లో దారి మళ్లించి నడిపించాలని దక్షణ మధ్య రైల్వే నిర్ణయించింది. కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూదిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. కాజీపేటతో పాటుగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించారు.

న్యూదిల్లీ - సికింద్రాబాద్‌ (నం. 12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముద్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లను ప్రయాణమార్గం నుంచి తొలగించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌ (దిల్లీ), నిజాముద్దీన్‌-సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు.

ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్​ప్రెస్ రైలు పునరుద్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.