Railway police seize 107 kg of illegally transported silver In Vijayawada: ఎటువంటి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని నిన్న రాత్రి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా బిల్లులు లేకుండా తరలిస్తున్న వెండి పట్టుబడింది. 107 కిలోలు ఉన్న వెండి విలువ సుమారు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని రైల్వే సీఐ జేవీ రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ వెండి ఆభరణాలను జీఎస్టీ అధికారులకు అప్పగించామని ఆయన వెల్లడించారు.
బిల్లులు లేకుండా తరలింపు - 107 కిలోల వెండి స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు - 107 KG SILVER SEIZE RAILWAY POLICE
ఆగ్రా నుంచి విజయవాడకు అక్రమంగా 107 కిలోల వెండి తరలింపు - బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు - జీఎస్టీ ఆధికారులకు అప్పగింత


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2025, 5:13 PM IST
Railway police seize 107 kg of illegally transported silver In Vijayawada: ఎటువంటి బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్లో తరలిస్తున్న వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని నిన్న రాత్రి రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టగా బిల్లులు లేకుండా తరలిస్తున్న వెండి పట్టుబడింది. 107 కిలోలు ఉన్న వెండి విలువ సుమారు కోటి రూపాయలకు పైగానే ఉంటుందని రైల్వే సీఐ జేవీ రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ వెండి ఆభరణాలను జీఎస్టీ అధికారులకు అప్పగించామని ఆయన వెల్లడించారు.