ETV Bharat / state

ఆస్పత్రిలో కరెంట్ కోతలు - అంధకారంలో బాలింతలు - ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్ - POWER CUTS IN MANCHERIAL HOSPITAL

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 1:38 PM IST

Updated : Jul 4, 2024, 1:45 PM IST

Matha Shishu Hospital in Mancherial Problems : విద్యుత్​ నిలిచిపోవడంతో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల నుంచి విద్యుత్​ సరఫరా నిలిపోయిందని చెబుతున్నారు. ఈ ఘటనపై బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు స్పందించారు.

Matha Shishu Hospital in Mancherial
Matha Shishu Hospital in Mancherial (ETV Bharat)

Power Cut in Mancherial Govt Mother and Child Hospital : సిబ్బంది నిర్లక్ష్యం బాలింతలు, నవజాత శిశువులు కొన్ని గంటలపాటు అంధకారంలో ఉండేలా చేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎలాంటి కాన్పులు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులుగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయి, ఆసుపత్రి నిర్వహణ మొత్తం జనరేటర్​ సాయంతో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​ రావు స్పందించారు.

బాధితుల ఆవేదన : ఓ వైపు వర్షాలు మొదలయ్యాయని, మరోవైపు పాములు ఎంసీహెచ్​ పరిసరాల్లో సంచరిస్తున్నాయని బాధితులు తెలిపారు. వీటికి తోడు విద్యుత్​ అంతరాయంతో ఎంసీహెచ్​లో ఆందోళన పరిస్థితి నెలకొందన్నారు. ఎలుకలు విద్యుత్​ సరఫరా కేబుళ్లను కొరకడంతో గత రెండు రోజులుగా కరెంటు నిలిచిపోయిందని సిబ్బంది చెబుతున్నారని పేర్కొన్నారు. పలుమార్లు షార్ట్​ సర్క్యూట్​తో ఇబ్బందులు ఎదురయ్యాయని, జనరేటర్​ కూడా వినియోగించలేని స్థితికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడ్డారని సిబ్బంది వెల్లడించారు.

గర్భిణీలకు, చిన్నపిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే శస్త్రచికిత్సలను వాయిదా వేశాం. ఎస్​ఎన్సీయూకు ప్రత్యామ్నాయం చేపట్టి సమస్యను గుర్తించాం. చివరకు జనరేటర్​ రిపేర్ చేశాం. కానీ నేరుగా విద్యుత్​ వచ్చేలా చేయలేకపోయాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం గురించి అధికారులకు సమాచారం అందిస్తే వారు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతానికి జనరేటర్​ను అయితే ఉపయోగించుకోవాలని మరుసటి రోజు వచ్చి మరమ్మతు చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. జనరేటర్​కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినా ఏదైనా ఇబ్బంది కలిగితే బాధితులు అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యపై బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. మంచిర్యాల ఎంసీహెచ్​ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడం వల్ల బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Green Energy

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసిన కోర్టు సిబ్బంది - RDO Office Seized in Mancherial

Power Cut in Mancherial Govt Mother and Child Hospital : సిబ్బంది నిర్లక్ష్యం బాలింతలు, నవజాత శిశువులు కొన్ని గంటలపాటు అంధకారంలో ఉండేలా చేసింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎలాంటి కాన్పులు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులుగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయి, ఆసుపత్రి నిర్వహణ మొత్తం జనరేటర్​ సాయంతో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీఆర్​ఎస్​ నేత, మాజీ మంత్రి హరీశ్​ రావు స్పందించారు.

బాధితుల ఆవేదన : ఓ వైపు వర్షాలు మొదలయ్యాయని, మరోవైపు పాములు ఎంసీహెచ్​ పరిసరాల్లో సంచరిస్తున్నాయని బాధితులు తెలిపారు. వీటికి తోడు విద్యుత్​ అంతరాయంతో ఎంసీహెచ్​లో ఆందోళన పరిస్థితి నెలకొందన్నారు. ఎలుకలు విద్యుత్​ సరఫరా కేబుళ్లను కొరకడంతో గత రెండు రోజులుగా కరెంటు నిలిచిపోయిందని సిబ్బంది చెబుతున్నారని పేర్కొన్నారు. పలుమార్లు షార్ట్​ సర్క్యూట్​తో ఇబ్బందులు ఎదురయ్యాయని, జనరేటర్​ కూడా వినియోగించలేని స్థితికి రావడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడ్డారని సిబ్బంది వెల్లడించారు.

గర్భిణీలకు, చిన్నపిల్లలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే శస్త్రచికిత్సలను వాయిదా వేశాం. ఎస్​ఎన్సీయూకు ప్రత్యామ్నాయం చేపట్టి సమస్యను గుర్తించాం. చివరకు జనరేటర్​ రిపేర్ చేశాం. కానీ నేరుగా విద్యుత్​ వచ్చేలా చేయలేకపోయాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం గురించి అధికారులకు సమాచారం అందిస్తే వారు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతానికి జనరేటర్​ను అయితే ఉపయోగించుకోవాలని మరుసటి రోజు వచ్చి మరమ్మతు చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. జనరేటర్​కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినా ఏదైనా ఇబ్బంది కలిగితే బాధితులు అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన చెందారు. అయితే ఈ సమస్యపై బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. మంచిర్యాల ఎంసీహెచ్​ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడం వల్ల బాలింతలు, నవజాత శిశువులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Green Energy

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం ఆస్తులను జప్తు చేసిన కోర్టు సిబ్బంది - RDO Office Seized in Mancherial

Last Updated : Jul 4, 2024, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.