ETV Bharat / state

ప్రయాణికులకు వరద కష్టాలు - దూరప్రాంతాలకు వెళ్లాలంటే అంతులేని నిరీక్షణ - transport Systrm Blocked in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 10:42 AM IST

People Suffer Due to Transport Systrm Blocked in Vijayawada : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్​, ఆర్టీసీ బస్​ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైళ్లు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

People Suffer on Transport Blocked
People Suffer on Transport Blocked (ETV Bharat)

People Suffer Due to Transport Systrm Blocked in Vijayawada : వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎటూ వెళ్లలేని దుస్ధితిలో ప్రయాణికులు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాశారు. బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

వరద వల్ల స్తంభించిన రవాణా వ్యవస్థ : విజయవాడలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కృష్ణా నది, మున్నేరు, బుడమేరు పొంగి వరదనీరు రైల్వే ట్రాక్‌లు, హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారిమళ్లించారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్‌ను వరద ముంచెత్తింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే కీలక రైల్వేలైన్‌ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం 140 రైళ్లను రద్దుచేయగా, 97 రైళ్లను దారిమళ్లించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

రైల్వేస్టేషన్లలలో ప్రయాణికులు పడిగాపులు : విజయవాడ శివారులోని రాయనపాడు స్టేషన్‌ను వరదనీరు చుట్టుముట్టింది. న్యూదిల్లీ-చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ను రాయనపాడులో నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల్లో 1,443 మందిని సమీపంలోని గుంటుపల్లి వేగన్‌ వర్క్‌షాప్‌ వద్దకు తరలిచారు. అక్కడి నుంచి 36 ఆర్టీసీ బస్సుల్లో వారిని విజయవాడ స్టేషన్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌-విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌-తాంబ్రం ఎక్స్‌ప్రెస్‌లను కొండపల్లి స్టేషన్‌లో నిలిపేశారు. ఈ రెండింటిలోని 3 వేల మంది ప్రయాణికులను 48 ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ స్టేషన్‌కు తరలించారు.

ప్రయాణికులు గందరగోళం : చెన్నై, తాంబ్రం, విశాఖపట్నాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి పంపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను నూజివీడు వద్ద నిలిపేశారు. ప్రయాణికులను 35 ఆర్టీసీ బస్సులతో పీఎన్​బీఎస్​కు తరలించారు. ఆకస్మికంగా రైళ్లు రద్దుకావంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో అనేక మంది ప్రయాణ ప్రాంగణాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ అవస్థలు పడ్డారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 94 రైళ్లు రద్దు - 41 దారి మళ్లింపు - Trains Cancelled and Rescheduled

ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్‌ : బెజవాడ బస్టాండ్ సైతం ప్రయాణికులతో నిండిపోయింది. రైళ్లు లేకపోవడంతో సమీపంలోని బస్టాండ్ కు వచ్చిన ప్రయాణికులు బస్సుల్లోనైనా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు పొంగి హైవేపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్‌కు బస్సులను నడిపారు. నగరంలో సిటీ బస్సులు పాక్షికంగానే నడిపారు. ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో నిలిపేయడంతో.. ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేశాయి. విజయవాడ- హైదరాబాద్‌ మధ్య కీలక మార్గాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలు బంద్‌ కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయిన పరిస్ధితి ఏర్పడింది.

భారీవర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికుల అవస్థలు - HEAVY RAINS IN AP

People Suffer Due to Transport Systrm Blocked in Vijayawada : వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎటూ వెళ్లలేని దుస్ధితిలో ప్రయాణికులు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాశారు. బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

వరద వల్ల స్తంభించిన రవాణా వ్యవస్థ : విజయవాడలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కృష్ణా నది, మున్నేరు, బుడమేరు పొంగి వరదనీరు రైల్వే ట్రాక్‌లు, హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారిమళ్లించారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్‌ను వరద ముంచెత్తింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే కీలక రైల్వేలైన్‌ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం 140 రైళ్లను రద్దుచేయగా, 97 రైళ్లను దారిమళ్లించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - దక్షిణమధ్య రైల్వే నుంచి 80 రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు - SCR Cancelled Trains

రైల్వేస్టేషన్లలలో ప్రయాణికులు పడిగాపులు : విజయవాడ శివారులోని రాయనపాడు స్టేషన్‌ను వరదనీరు చుట్టుముట్టింది. న్యూదిల్లీ-చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ను రాయనపాడులో నిలిపేశారు. వెంటనే ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల్లో 1,443 మందిని సమీపంలోని గుంటుపల్లి వేగన్‌ వర్క్‌షాప్‌ వద్దకు తరలిచారు. అక్కడి నుంచి 36 ఆర్టీసీ బస్సుల్లో వారిని విజయవాడ స్టేషన్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌-విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌-తాంబ్రం ఎక్స్‌ప్రెస్‌లను కొండపల్లి స్టేషన్‌లో నిలిపేశారు. ఈ రెండింటిలోని 3 వేల మంది ప్రయాణికులను 48 ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ స్టేషన్‌కు తరలించారు.

ప్రయాణికులు గందరగోళం : చెన్నై, తాంబ్రం, విశాఖపట్నాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి పంపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను నూజివీడు వద్ద నిలిపేశారు. ప్రయాణికులను 35 ఆర్టీసీ బస్సులతో పీఎన్​బీఎస్​కు తరలించారు. ఆకస్మికంగా రైళ్లు రద్దుకావంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో అనేక మంది ప్రయాణ ప్రాంగణాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ అవస్థలు పడ్డారు.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 94 రైళ్లు రద్దు - 41 దారి మళ్లింపు - Trains Cancelled and Rescheduled

ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్‌ : బెజవాడ బస్టాండ్ సైతం ప్రయాణికులతో నిండిపోయింది. రైళ్లు లేకపోవడంతో సమీపంలోని బస్టాండ్ కు వచ్చిన ప్రయాణికులు బస్సుల్లోనైనా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిలో నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు పొంగి హైవేపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్‌కు బస్సులను నడిపారు. నగరంలో సిటీ బస్సులు పాక్షికంగానే నడిపారు. ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో నిలిపేయడంతో.. ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేశాయి. విజయవాడ- హైదరాబాద్‌ మధ్య కీలక మార్గాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలు బంద్‌ కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయిన పరిస్ధితి ఏర్పడింది.

భారీవర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికుల అవస్థలు - HEAVY RAINS IN AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.