ETV Bharat / state

ఆరోగ్యం బాగాలేక కాంస్యం గెలిచా - నెక్ట్స్ గోల్డ్ మెడల్ పక్కా : దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Reached India

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 1:43 PM IST

Bronze Medal Winner Deepthi Reached Hyderabad : కడు పేదరికం నుంచి కాంస్య పథకం గెలుచుకునే స్థాయికి ఎదిగి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది దీప్తి జీవాంజి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి ప్రపంచ వేదికపై పారాలింపిక్స్​లో మహిళల 400 మీటర్ల టీ 20 విభాగంలో కాంస్య పథకం సాధించింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన దీప్తికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.

Jeevanji Deepthi Wins Bronze Medal in Paralympics 2024
Jeevanji Deepthi Wins Bronze Medal in Paralympics 2024 (ETV Bharat)

Jeevanji Deepthi Wins Bronze Medal in Paralympics 2024 : పారిస్ పారాలింపిక్స్​లో రాణించినా, ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాయని ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి జీవాంజి తెలిపారు. అందుకే కాంస్య పతకం వచ్చిందని చెప్పారు. మహిళల టీ20 400 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుని గురువారం స్వదేశానికి వచ్చారు. అనంతరం ఆమెను కేంద్ర క్రీడల మంత్రి మన్​సుఖ్ మాండవీయ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశం గర్వపడేలా చేశారన్నారు.

శుక్రవారం ఉదయం ఆమె హైదరాబాద్​కు చేరారు. విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి కోట్ నాగపురి రమేశ్, దీప్తిని అభినందించారు. తెలంగాణ బిడ్డ దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని శివసేన రెడ్డి అన్నారు. తర్వాత వారు గోపిచంద్ అకాడమీ బయలుదేరారు.

దీప్తి జీవాంజీకి పారాలింపిక్స్​లో కాంస్యం - స్వగ్రామంలో సంబురాలు - Deepthi Jeevanji Paris Paralympics

"కాంస్య పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల తృటిలో బంగారు పతకం చేజారింది. భవిష్యత్​లో బంగారు పతకం సాధిస్తా. ఈనాడు లక్ష్య కార్యక్రమం నాకు చాలా ఉపయోగపడింది. ఈనాడుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 8 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు." - దీప్తి జీవాంజి, పారా అథ్లెట్

దేశంలోనే టీ20 400మీటర్ల పతకం సాధించిన మొదటి మహిళ దీప్తి తెలంగాణ బిడ్డ కావడం మనందరికి గర్వకారణమని సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. 2028లో గోల్డ్​ మెడల్ సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. వచ్చే ఒలింపిక్స్​లో విద్యార్థులను మెడల్స్ సాధించే దిశగా సాట్ పని చేస్తుందని తెలిపారు. అందరికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దీప్తి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని చెప్పారు. తను అడిగిన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారని ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అప్పుడు అందరూ ఎగతాళి చేశారు - ఇప్పుడు మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేసింది : దీప్తి తల్లిదండ్రులు - Jeevanji Deepthi Paralympics 2024

పారాలింపిక్స్​లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ - కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Wins Bronze Medal

Jeevanji Deepthi Wins Bronze Medal in Paralympics 2024 : పారిస్ పారాలింపిక్స్​లో రాణించినా, ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాయని ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి జీవాంజి తెలిపారు. అందుకే కాంస్య పతకం వచ్చిందని చెప్పారు. మహిళల టీ20 400 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుని గురువారం స్వదేశానికి వచ్చారు. అనంతరం ఆమెను కేంద్ర క్రీడల మంత్రి మన్​సుఖ్ మాండవీయ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశం గర్వపడేలా చేశారన్నారు.

శుక్రవారం ఉదయం ఆమె హైదరాబాద్​కు చేరారు. విమానాశ్రయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి కోట్ నాగపురి రమేశ్, దీప్తిని అభినందించారు. తెలంగాణ బిడ్డ దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉందని శివసేన రెడ్డి అన్నారు. తర్వాత వారు గోపిచంద్ అకాడమీ బయలుదేరారు.

దీప్తి జీవాంజీకి పారాలింపిక్స్​లో కాంస్యం - స్వగ్రామంలో సంబురాలు - Deepthi Jeevanji Paris Paralympics

"కాంస్య పతకం గెలవడం చాలా గర్వంగా ఉంది. నాకు కాస్త అనారోగ్యంగా ఉండటం వల్ల తృటిలో బంగారు పతకం చేజారింది. భవిష్యత్​లో బంగారు పతకం సాధిస్తా. ఈనాడు లక్ష్య కార్యక్రమం నాకు చాలా ఉపయోగపడింది. ఈనాడుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కోచ్, తల్లిదండ్రులు నా విజయానికి పూర్తిగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. 8 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు." - దీప్తి జీవాంజి, పారా అథ్లెట్

దేశంలోనే టీ20 400మీటర్ల పతకం సాధించిన మొదటి మహిళ దీప్తి తెలంగాణ బిడ్డ కావడం మనందరికి గర్వకారణమని సాట్ ఛైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. 2028లో గోల్డ్​ మెడల్ సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. వచ్చే ఒలింపిక్స్​లో విద్యార్థులను మెడల్స్ సాధించే దిశగా సాట్ పని చేస్తుందని తెలిపారు. అందరికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దీప్తి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయని చెప్పారు. తను అడిగిన వాటిపై ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లారని ఆయన దానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

అప్పుడు అందరూ ఎగతాళి చేశారు - ఇప్పుడు మెడల్ సాధించి దేశం గర్వపడేలా చేసింది : దీప్తి తల్లిదండ్రులు - Jeevanji Deepthi Paralympics 2024

పారాలింపిక్స్​లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ - కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Wins Bronze Medal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.