Naga chaitanya Sobhita: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులు నాగచైతన్య, శోభితతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి నాగార్జున కుటుంబసభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు.
అనంతరం నూతన దంపతులు నాగచైతన్య, శోభితలకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో షేర్ అవుతున్నాయి.
ఇప్పటికే నాగచైతన్య శోభిత వివాహ ఫొటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మీడియాకు, ఫ్యాన్స్కు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్, మీ ప్రేమ, ఆశీస్సులు ఈ వేడుకను ప్రత్యేకం చేశాయంటూ చెప్పుకొచ్చారు. ఈ అందమైన క్షణాల్లో తమను అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతతో తన హృదయం ఉప్పొంగుతోందని నాగార్జున పేర్కొన్నారు.
My heart is overflowing with gratitude. 🙏
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 5, 2024
To the media, thank you for your understanding and for giving us the space to cherish this beautiful moment. Your thoughtful respect and kind wishes have added to our joy.
To our dear friends, family, and fans, your love and blessings… pic.twitter.com/1rntU4tDQP
మూడు ముళ్లతో ఒక్కటైన నాగచైతన్య, శోభిత - వేడుకకు హాజరైన చిరంజీవి