ETV Bharat / state

కంకర క్వారీలో జరిగిన ప్రమాదంపై గనులు, భూగర్భశాఖ నివేదిక-క్వారీ లైసెన్సు రద్దు చేస్తూ నోటీసులు - Accident Due Management Negligence

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 10:40 AM IST

Gravel Quarry Accident Due To Negligence of Management in NTR District : వారు రోజులోగే పనికి వెళ్లారు. కానీ విగత జీవులయ్యారు. క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమా! అసలేం జరిగింది.

gravel_quarry_accident_due_to_negligence_of_management
gravel_quarry_accident_due_to_negligence_of_management (ETV Bharat)

Gravel Quarry Accident Due To Negligence of Management in NTR District : ఎన్టీఆర్​ జిల్లా పరిటాల వద్ద కంకర క్వారీలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని గనులు, భూగర్భశాఖ నివేదించింది. పై నుంచి భారీ బండరాళ్లు పడి కింద పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కంకర డ్రిల్లింగ్ పనులు చేపట్టడం వల్ల బండరాళ్లు దొర్లిపడ్డాయని నివేదికలో తెలిపారు. క్వారీ లైసెన్సు రద్దు చేస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కార్మికశాఖ అధికారులు పూర్తి నివేదిక రూపొందించి ఆ శాఖ కమిషనర్​కు పంపారు. కంకర క్వారీ యాజమాన్యం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని నిర్థారించారు. కనీసం బూట్లు, తలకు హెల్మెట్ లాంటి రక్షణ పరికరాలు అందించలేదు.

3 Workers Lost Breath In Granite Quarry At Nandigama, NTR District : చనిపోయిన వారిలో దుర్గరాజ్ స్వయంగా యంత్రం తెచ్చి డ్రిల్ చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఛత్తీస్​ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో యాజమాన్యం పనులను అనధికారికంగా అప్పగించింది. ఈ పరిస్థితులను నివేదించిన గనుల భద్రత విభాగం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్​కు లైసెన్సు రద్దుకు సిఫార్సు చేసింది. కార్మికశాఖ కమిషనర్ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం - క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం - Accident in Quarry Several Dead

క్వారీ ప్రమాదాల -నివారణకు అనుక్షణం అధికారుల పర్యవేక్షణ ఉండాలని సీఐ టీయూ మండల కార్యదర్శి మహేష్ కోరారు. ప్రమాదాల నివారణకు తనిఖీలు చేపట్టాలని కోరుతూ సీఐటీయూ నాయకులు సోమవారం తహసీల్దారును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని క్వారీ, క్రషర్లకు అనుమతులు లేకపోయినా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారన్నారు. వాటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీ కార్మికులు అనేక మందికి ఈఎస్ఐ, పీఎఫ్​లు వంటివి లేనందున ప్రమాదాల్లో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. విఠలరావు, బాషా, నారాయణ, శ్రీను పాల్గొన్నారు.

గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది మృతి- ఇంకా శిథిలాల కిందే పలువురు!

Gravel Quarry Accident Due To Negligence of Management in NTR District : ఎన్టీఆర్​ జిల్లా పరిటాల వద్ద కంకర క్వారీలో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని గనులు, భూగర్భశాఖ నివేదించింది. పై నుంచి భారీ బండరాళ్లు పడి కింద పని చేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కంకర డ్రిల్లింగ్ పనులు చేపట్టడం వల్ల బండరాళ్లు దొర్లిపడ్డాయని నివేదికలో తెలిపారు. క్వారీ లైసెన్సు రద్దు చేస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కార్మికశాఖ అధికారులు పూర్తి నివేదిక రూపొందించి ఆ శాఖ కమిషనర్​కు పంపారు. కంకర క్వారీ యాజమాన్యం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని నిర్థారించారు. కనీసం బూట్లు, తలకు హెల్మెట్ లాంటి రక్షణ పరికరాలు అందించలేదు.

3 Workers Lost Breath In Granite Quarry At Nandigama, NTR District : చనిపోయిన వారిలో దుర్గరాజ్ స్వయంగా యంత్రం తెచ్చి డ్రిల్ చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు ఛత్తీస్​ఘడ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులు. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో యాజమాన్యం పనులను అనధికారికంగా అప్పగించింది. ఈ పరిస్థితులను నివేదించిన గనుల భద్రత విభాగం పవన్ గ్రానైట్ అండ్ మెటల్ వర్క్స్​కు లైసెన్సు రద్దుకు సిఫార్సు చేసింది. కార్మికశాఖ కమిషనర్ చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకు ఆదేశాలు ఇవ్వనున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం - క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం - Accident in Quarry Several Dead

క్వారీ ప్రమాదాల -నివారణకు అనుక్షణం అధికారుల పర్యవేక్షణ ఉండాలని సీఐ టీయూ మండల కార్యదర్శి మహేష్ కోరారు. ప్రమాదాల నివారణకు తనిఖీలు చేపట్టాలని కోరుతూ సీఐటీయూ నాయకులు సోమవారం తహసీల్దారును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని క్వారీ, క్రషర్లకు అనుమతులు లేకపోయినా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారన్నారు. వాటి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీ కార్మికులు అనేక మందికి ఈఎస్ఐ, పీఎఫ్​లు వంటివి లేనందున ప్రమాదాల్లో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. విఠలరావు, బాషా, నారాయణ, శ్రీను పాల్గొన్నారు.

గ్రానైట్‌ క్వారీ కూలి పది మంది మృతి- ఇంకా శిథిలాల కిందే పలువురు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.