ETV Bharat / state

పాత రూపాయి చూపిస్తే రూ.12 లక్షలు - ఆశకు పోయి రూ.2 లక్షలు పోగొట్టుకున్న వైనం - MAN CHEATED BY CYBER FRAUDSTERS

సైబర్ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పార్వతీపురం మండలంలో ఓ వ్యక్తికి 12 లక్షలు ఆశ చూపించి అతని వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయలను కాజేశారు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

MAN CHEATED BY CYBER FRAUDSTERS IN MANYAM DISTRICT
MAN CHEATED BY CYBER FRAUDSTERS IN MANYAM DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 2:14 PM IST

Man Cheated By Cyber Fraudsters In Manyam District: సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మండలంలో ఓ వ్యక్తికి 12 లక్షలు ఆశ చూపించి అతని వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయలను కాజేశారు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోనికి వెళ్తే

స్థానికుల కథనం ప్రకారం: గంగాపురం పంచాయతీ కోరి గ్రామానికి చెందిన రాయల శంకరరావు లారీ డ్రైవరు. పాత రూపాయి నోటు మీ వద్ద ఉంటే 12 లక్షలు సొంతం చేసుకోవచ్చంటూ యూట్యూబ్‌లో వచ్చిన ప్రకటన చూసి సదరు వ్యక్తులతో సంప్రదింపులు జరిపాడు. వారు తొలుత కొంత నగదు కట్టాలని కోరడంతో విడతల వారీగా 2 లక్షల రూపాయలు చెల్లించాడు. తర్వాత 12 లక్షల కోసం అడగ్గా ఫోన్ కట్ చేశారు. ఎన్నిసార్లు చేసినా అందుబాటులోకి రాకపోవడంతో నష్టపోయినట్లు గుర్తించి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Man Cheated By Cyber Fraudsters In Manyam District: సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మండలంలో ఓ వ్యక్తికి 12 లక్షలు ఆశ చూపించి అతని వద్ద నుంచి సుమారు 2 లక్షల రూపాయలను కాజేశారు. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోనికి వెళ్తే

స్థానికుల కథనం ప్రకారం: గంగాపురం పంచాయతీ కోరి గ్రామానికి చెందిన రాయల శంకరరావు లారీ డ్రైవరు. పాత రూపాయి నోటు మీ వద్ద ఉంటే 12 లక్షలు సొంతం చేసుకోవచ్చంటూ యూట్యూబ్‌లో వచ్చిన ప్రకటన చూసి సదరు వ్యక్తులతో సంప్రదింపులు జరిపాడు. వారు తొలుత కొంత నగదు కట్టాలని కోరడంతో విడతల వారీగా 2 లక్షల రూపాయలు చెల్లించాడు. తర్వాత 12 లక్షల కోసం అడగ్గా ఫోన్ కట్ చేశారు. ఎన్నిసార్లు చేసినా అందుబాటులోకి రాకపోవడంతో నష్టపోయినట్లు గుర్తించి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


'10 రోజులపాటు హింసించారు' - రూ.36 లక్షలు పోగొట్టుకున్న విశ్రాంత ఉద్యోగి

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ సైబర్‌ నేరాలు - నిందితుడి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.