ETV Bharat / state

మహోగ్రరూపం దాల్చిన గోదావరి - వరదముంపులోనే కోనసీమ లంక గ్రామాలు - GODAVARI FLOODS in Lanka Areas

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 8:12 PM IST

Lanka People Suffering From Godavari Floods: గోదావరి వరద మళ్లీ పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. భారీగా వరద రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గ్రామాలు, మెట్టపంటలు వరద నీటిలోనే నానుతున్నాయి. లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు.

Lanka People Suffering From Godavari Floods
Lanka People Suffering From Godavari Floods (ETV Bharat)

Lanka People Suffering From Godavari Floods: గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. అఖండ గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. భారీగా వరద జలాల రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలు ముంపులోనే చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశలుండటంతో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

గోదావరి వరద మళ్లీ పుంజుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. కొద్ది రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవహంతో బిక్కుబిక్కుమంటున్నారు. సీలేరు, శబరి పరీవాహకాలు భారీ వరద నీటితో గోదావరిలో చేరడంతో వరద ఉద్ధృతి మరికొన్ని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన మండలాలను వరద నీరు విడవడం లేదు.

పొంగుతున్న గోదావరి, శబరి- నీట మునిగిన ఇళ్లు, పొలాలు - GODAVARI FLOOD

కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలు ఉగ్రరూపం దాల్చాయి. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మడివరం, తాళ్లరేవు, రామచంద్రాపురం, కే.గంగావరం, యానాం గౌతవి గోదావరి వరద ముంపులో ఉన్నాయి. క్రమక్రమంగా వరద పెరుగుతోంది. ఉద్యానవన పంటలు , అరటి, బొప్పాయి వంటి పంటలు రోజుల తరబడి నీటిలో నానుతుండతంటో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి మండలంలోని ఎదురుబిడెంలో పడవలపైనే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్‌ ఠానెలంక, తాళ్లరేవు మండలం గోవులలంక, రామచంద్రాపురం మండలం శేరులలంక గౌతమి గోదావరి వరద ఉద్ధృతిలో చిక్కుకున్నాయి. పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల లంక, కనకాయ లంక, ఇతర లంకల్లోకి వరద నీరు చేరి జనాలు అవస్థలు పడుతున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో దర్శనాలను నిలిపేశారు. బి.దొడ్డవరం, మానేపల్లి, అల్లవరం మండలం బొడసకుర్రు, శివాలయలంక సఖినేటిపల్లి మండలంలోని అప్పునురాముని లంక, రామరాజు లంక, కొత్తలంక, టేకుశెట్టిపాలెం, ఓఎన్జీసీ కాలనీలు వరదలోనే ఉన్నాయి. సఖినేటిపల్లి మండలంలోని కొత్తలంక, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజ్‌వే, బి.దొడ్డవరం జలదిగ్బంధమయ్యాయి. లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు నిత్యావసరాలు, తాగునీరు అందజేస్తున్నారు.

క్షణక్షణం ఆందోళన రేకెత్తిస్తున్న గోదావరి ప్రవాహం- వరద గుప్పిట్లోనే లంక గ్రామాలు - GODAVARI FLOOD

ముమ్మడివరంలో గౌతమి, వృద్ధ గౌతమి గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. గ్రామాలు, మెట్టపంటలు వరద నీటిలోనే నానుతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లా అంతకంతకూ పెరుగుతున్న వరద ఉద్ధృతికి తోడు కురుస్తున్న వర్షాలతో లంక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండో పోతోంది. గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ ఠానేలంకల్లో రహదారులను, నివాస గృహాలను వరద చుట్టుముట్టింది. వందల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు.

పి.గన్నవరం మండలం బూరుగుపూడి లంకలో పడవ ప్రమాదం జరిగింది. బూరుగుపూడి లంక నుంచి జీ.పెదపూడి లంక, ఊడుమూడి లంక వాసులకు తాగునీరు తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఒకరు గల్లంతయ్యారు. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. అధిక లోడ్‌తో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్​ఎఫ్​, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - పెద్ద వాగు సమస్య తీరుస్తామని భరోసా - Ministers Visited Flood Areas

Lanka People Suffering From Godavari Floods: గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. అఖండ గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. భారీగా వరద జలాల రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలు ముంపులోనే చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశలుండటంతో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

గోదావరి వరద మళ్లీ పుంజుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. కొద్ది రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవహంతో బిక్కుబిక్కుమంటున్నారు. సీలేరు, శబరి పరీవాహకాలు భారీ వరద నీటితో గోదావరిలో చేరడంతో వరద ఉద్ధృతి మరికొన్ని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన మండలాలను వరద నీరు విడవడం లేదు.

పొంగుతున్న గోదావరి, శబరి- నీట మునిగిన ఇళ్లు, పొలాలు - GODAVARI FLOOD

కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలు ఉగ్రరూపం దాల్చాయి. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మడివరం, తాళ్లరేవు, రామచంద్రాపురం, కే.గంగావరం, యానాం గౌతవి గోదావరి వరద ముంపులో ఉన్నాయి. క్రమక్రమంగా వరద పెరుగుతోంది. ఉద్యానవన పంటలు , అరటి, బొప్పాయి వంటి పంటలు రోజుల తరబడి నీటిలో నానుతుండతంటో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి మండలంలోని ఎదురుబిడెంలో పడవలపైనే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్‌ ఠానెలంక, తాళ్లరేవు మండలం గోవులలంక, రామచంద్రాపురం మండలం శేరులలంక గౌతమి గోదావరి వరద ఉద్ధృతిలో చిక్కుకున్నాయి. పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల లంక, కనకాయ లంక, ఇతర లంకల్లోకి వరద నీరు చేరి జనాలు అవస్థలు పడుతున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో దర్శనాలను నిలిపేశారు. బి.దొడ్డవరం, మానేపల్లి, అల్లవరం మండలం బొడసకుర్రు, శివాలయలంక సఖినేటిపల్లి మండలంలోని అప్పునురాముని లంక, రామరాజు లంక, కొత్తలంక, టేకుశెట్టిపాలెం, ఓఎన్జీసీ కాలనీలు వరదలోనే ఉన్నాయి. సఖినేటిపల్లి మండలంలోని కొత్తలంక, మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి కాజ్‌వే, బి.దొడ్డవరం జలదిగ్బంధమయ్యాయి. లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు నిత్యావసరాలు, తాగునీరు అందజేస్తున్నారు.

క్షణక్షణం ఆందోళన రేకెత్తిస్తున్న గోదావరి ప్రవాహం- వరద గుప్పిట్లోనే లంక గ్రామాలు - GODAVARI FLOOD

ముమ్మడివరంలో గౌతమి, వృద్ధ గౌతమి గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. గ్రామాలు, మెట్టపంటలు వరద నీటిలోనే నానుతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లా అంతకంతకూ పెరుగుతున్న వరద ఉద్ధృతికి తోడు కురుస్తున్న వర్షాలతో లంక గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండో పోతోంది. గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ ఠానేలంకల్లో రహదారులను, నివాస గృహాలను వరద చుట్టుముట్టింది. వందల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు.

పి.గన్నవరం మండలం బూరుగుపూడి లంకలో పడవ ప్రమాదం జరిగింది. బూరుగుపూడి లంక నుంచి జీ.పెదపూడి లంక, ఊడుమూడి లంక వాసులకు తాగునీరు తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో ఒకరు గల్లంతయ్యారు. మరో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. అధిక లోడ్‌తో వెళ్లడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గల్లంతైన వ్యక్తి కోసం ఎన్డీఆర్​ఎఫ్​, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - పెద్ద వాగు సమస్య తీరుస్తామని భరోసా - Ministers Visited Flood Areas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.