ETV Bharat / state

రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 10:27 AM IST

Updated : Sep 8, 2024, 3:08 PM IST

AP Rains Today 2024 : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP Rains Today 2024
AP Rains Today 2024 (ETV Bharat)

AP Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నుంచి ఒడిశాలోని పారాదీప్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Weather Updates : రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కోనసీమ నది పాయల్లో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసహరించారు. ఈ క్రమంలోనే అధికారులు 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో బ్యారేజీ దిగువ ఉన్న వశిష్ట, వైనతేయ గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహంతో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కోనసీమలోని లంక గ్రామాలైన కనకయ్యలంక, జి.పెదపూడి లంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, అయోధ్యలంక, ఆనగార్లంక, పెదమల్లలంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

మున్నేరుకు క్రమంగా పెరుగుతున్న వరద : మరోవైపు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మున్నేరుకు క్రమంగా వరద పెరుగుతోంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైతే ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలంపల్లి జలాశయం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు 6,046 క్కూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇది క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయం 5 గంటలకు 41,473 క్కూసెక్కులకు చేరిందని పేర్కొన్నారు. మున్నేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Heavy Rains in Andhra Pradesh : ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తిరువూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ నుంచి వరద వచ్చి చేరుతోంది. ఎన్​ఎస్పీ తిరువూరు మేజరు కాలువకు సుగాలీ కాలనీ వద్ద గండ్లు పడ్డాయి. సుగాలి కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోసారి కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ, అలుగు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలంలో పలు వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తుంది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss

విజయవాడ సింగ్ నగర్​లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas

AP Rain Alert : వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. క్రమంగా మరింత బలపడుతూ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాజస్థాన్‌లోని బికనేర్‌ నుంచి ఒడిశాలోని పారాదీప్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Weather Updates : రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కోనసీమ నది పాయల్లో గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసహరించారు. ఈ క్రమంలోనే అధికారులు 8.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో బ్యారేజీ దిగువ ఉన్న వశిష్ట, వైనతేయ గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు వరద ప్రవాహంతో పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మరోవైపు కోనసీమలోని లంక గ్రామాలైన కనకయ్యలంక, జి.పెదపూడి లంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక, అయోధ్యలంక, ఆనగార్లంక, పెదమల్లలంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.

మున్నేరుకు క్రమంగా పెరుగుతున్న వరద : మరోవైపు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మున్నేరుకు క్రమంగా వరద పెరుగుతోంది. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైతే ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలంపల్లి జలాశయం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు 6,046 క్కూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. ఇది క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయం 5 గంటలకు 41,473 క్కూసెక్కులకు చేరిందని పేర్కొన్నారు. మున్నేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Heavy Rains in Andhra Pradesh : ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తిరువూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ నుంచి వరద వచ్చి చేరుతోంది. ఎన్​ఎస్పీ తిరువూరు మేజరు కాలువకు సుగాలీ కాలనీ వద్ద గండ్లు పడ్డాయి. సుగాలి కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోసారి కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, కొండ, అలుగు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలంలో పలు వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తుంది. పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss

విజయవాడ సింగ్ నగర్​లో తగ్గుతున్న వరద - సహాయక చర్యలు వేగవంతం - Relief Work in Flood Affected Areas

Last Updated : Sep 8, 2024, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.