ETV Bharat / state

ఊరూ, వాడా 'గణేష్ మహరాజ్ కీ జై'- వివిధ రూపాల్లో భక్తులకు కనువిందు - GANESH CHATURTHI CELEBRATIONS IN AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 8:39 AM IST

Ganesh Chaturthi Festival was Celebrating Grandly in AP : గణేశ్ నవరాత్రోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. ఊరువాడల్లో గణనాథుడి మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో కొలువు దీరిన వినాయకులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

GANESH CHATURTHI CELEBRATIONS IN AP
GANESH CHATURTHI CELEBRATIONS IN AP (ETV Bharat)

Ganesh Chaturthi Festival Celebrating Grandly in AP : వినాయక చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా విభిన్న రూపాల్లో వినాయకుడి విగ్రహాలు మండపాల్లో కొలువుదీరాయి. భక్తులు వినాయకుడిని ప్రత్యేకంగా అలకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఆక్రిలిక్ పెరల్స్‌తో కదిలే గణపతి : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రాజాజీ వీధిలో ఏర్పాటు చేసిన 15 అడుగుల గణేషుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. నెల్లూరు నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లలో భారీ వినాయక విగ్రహాలను కొలువుతీర్చారు. మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని లంబోదర సెంటర్‌లో కొలువుదీరిన వినాయకుడికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూజలు చేశారు. కోవూరు మండలం ఇనమడుగు సెంటర్‌లోని గణనాథుడు విగ్రహాన్ని 3,600 ముత్యాల పూసలతో అలంకరించారు. ఇనమడుగు మిక్సెడ్ కాలనీలో ఆక్రిలిక్ పెరల్స్‌తో కదిలే గణపతి విగ్రహాన్ని రూపొందించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణతో పందిళ్లు ఏర్పాటు చేసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం భక్తజనంతో పోటెత్తింది. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP

మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజలు : విజయవాడ సితార సెంట‌ర్ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల గ‌ణ‌ప‌తి విగ్రహాన్ని ఎంపీ కేశినేని చిన్ని ద‌ర్శించుకున్నారు. విజయవాడలో వినాయక నిమజ్జనం కార్యక్రమం సీతమ్మవారి పాదాలు వద్దనే చేయాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం వైఎస్ఆర్ నగర్‌లో ఆదిశేషుని అవతారంలో గణపతిని ఏర్పాటు చేశారు. రైల్వే గూడ్స్ షెడ్ ప్రాంతంలో శివతాండవ రూపంలో బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేశారు. స్టేడియం కాలనీ, యాతవీధిలో మర్రిచెట్టు ఊడల మధ్య, కొబ్బరిచిప్పలోనూ విభిన్నంగా వినాయక మండపాలు, విగ్రహాలు నెలకొల్పారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో చాక్లెట్ వినాయకుడిని ప్రతిష్టించారు.

చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu

తమలపాకులతో పర్యావరణహిత భారీ వినాయకుడు : కడప నగరంలో దాదాపు 200 పైగానే గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఎన్జీవో కాలనీ, రాజీవ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని తుమ్మలగుంటలో తమలపాకులతో పర్యావరణహిత భారీ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు. లక్ష్మీపురం సాయిబాబా గుడి వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి నేతలు భక్తులకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవమూర్తిగా తీర్చిదిద్దారు. మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వాడవాడలా గణేష్ మండపాలు వెలిశాయి. కర్నూలు నగరంలో వివిధ రకాల గణేష్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసిన 65 అడుగుల మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కురువ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంత్రి టీజీ. భరత్ ప్రత్యేక పూజలు చేశారు.

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession

Ganesh Chaturthi Festival Celebrating Grandly in AP : వినాయక చవితి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా విభిన్న రూపాల్లో వినాయకుడి విగ్రహాలు మండపాల్లో కొలువుదీరాయి. భక్తులు వినాయకుడిని ప్రత్యేకంగా అలకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ఆక్రిలిక్ పెరల్స్‌తో కదిలే గణపతి : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని రాజాజీ వీధిలో ఏర్పాటు చేసిన 15 అడుగుల గణేషుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. నెల్లూరు నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లలో భారీ వినాయక విగ్రహాలను కొలువుతీర్చారు. మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని లంబోదర సెంటర్‌లో కొలువుదీరిన వినాయకుడికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూజలు చేశారు. కోవూరు మండలం ఇనమడుగు సెంటర్‌లోని గణనాథుడు విగ్రహాన్ని 3,600 ముత్యాల పూసలతో అలంకరించారు. ఇనమడుగు మిక్సెడ్ కాలనీలో ఆక్రిలిక్ పెరల్స్‌తో కదిలే గణపతి విగ్రహాన్ని రూపొందించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలంకరణతో పందిళ్లు ఏర్పాటు చేసి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం భక్తజనంతో పోటెత్తింది. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఊరువాడ పూజలు అందుకున్న గణనాథుడు - వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య - Ganesh Chaturthi Celebrations in AP

మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజలు : విజయవాడ సితార సెంట‌ర్ లేబ‌ర్ కాల‌నీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల గ‌ణ‌ప‌తి విగ్రహాన్ని ఎంపీ కేశినేని చిన్ని ద‌ర్శించుకున్నారు. విజయవాడలో వినాయక నిమజ్జనం కార్యక్రమం సీతమ్మవారి పాదాలు వద్దనే చేయాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం వైఎస్ఆర్ నగర్‌లో ఆదిశేషుని అవతారంలో గణపతిని ఏర్పాటు చేశారు. రైల్వే గూడ్స్ షెడ్ ప్రాంతంలో శివతాండవ రూపంలో బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేశారు. స్టేడియం కాలనీ, యాతవీధిలో మర్రిచెట్టు ఊడల మధ్య, కొబ్బరిచిప్పలోనూ విభిన్నంగా వినాయక మండపాలు, విగ్రహాలు నెలకొల్పారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో చాక్లెట్ వినాయకుడిని ప్రతిష్టించారు.

చెవిలో కోరికలు చెబితే తీర్చే వినాయకుడు - ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా! - Vinayaka Chavithi utsavalu

తమలపాకులతో పర్యావరణహిత భారీ వినాయకుడు : కడప నగరంలో దాదాపు 200 పైగానే గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఎన్జీవో కాలనీ, రాజీవ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతిలోని తుమ్మలగుంటలో తమలపాకులతో పర్యావరణహిత భారీ వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు. లక్ష్మీపురం సాయిబాబా గుడి వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి నేతలు భక్తులకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవమూర్తిగా తీర్చిదిద్దారు. మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో వాడవాడలా గణేష్ మండపాలు వెలిశాయి. కర్నూలు నగరంలో వివిధ రకాల గణేష్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఓల్డ్ సిటీలో ఏర్పాటు చేసిన 65 అడుగుల మట్టి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. కురువ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంత్రి టీజీ. భరత్ ప్రత్యేక పూజలు చేశారు.

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.