ETV Bharat / state

చిరుత కోసం 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు - త్వరలోనే పట్టుకుంటాం: DFO భరణి - Leopard Wandering in Rajahmundry

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 5:10 PM IST

Leopard in Rajahmundry Updates : రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువులో ఆపరేషన్ చిరుత కొనసాగతుంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు భరణి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని ఆమె వివరించారు.

Leopard in Rajahmundry Updates
Leopard in Rajahmundry Updates (ETV Bharat)

Operation Leopard in Rajamahendravaram : గత కొద్దిరోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్​ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరుతను బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇంఛార్జ్​ డీఎఫ్​ఓ భరణి తెలిపారు. దానిని పట్టుకునేందుకు 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కానీ అది మాత్రం ఎక్కడా చిక్కడం లేదని భరణి పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ చిరుత 4 సార్లు మాత్రమే కెమెరాలకు చిక్కిందని భరణి వివరించారు. దాని కదలికలను బట్టి ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సాధారణ డ్రోన్ సహాయంతో చిరుత సంచారాన్ని గాలించినప్పటికీ జాడ కనబడలేదన్నారు. అందుకే థర్మల్ డ్రోన్​ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటువంటి డ్రోన్లు రాత్రిపూట సైతం సమర్థవంతంగా పని చేస్తాయని భరణి వెల్లడించారు.

'ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలి. జాతీయ రహదారిపై స్పీన్లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశాం. చిరుతలు సాధారణంగా జనావాసాల్లోకి రావడం తక్కువ. మనుషుల కంటపడేందుకు ఇష్టపడవు. అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతాయి' అని భరణి వివరించారు.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : సాధారణంగా చిరుతలు ఒంటరిగా నివసించేందుకే ఇష్టపడతాయని భరణి తెలిపారు. సహచరి, పిల్లలతో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా గుంపుగా తిరుగుతాయని చెప్పారు. ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని సందర్భాల్లో అవి జనావాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. ఎవరికైనా చిరుత ఎదురుపడితే పరిగెత్తవద్దని పేర్కొన్నారు. కాస్త దూరంగా ఉండి చేతులు పైకెత్తి, దానివైపు ఓ కన్ను వేసి నెమ్మదిగా వెనక్కి నడవాలని చెప్పారు. కొందరు భయపడి చెట్ల మాటున దాక్కుంటారని అలా చేయవద్దని వివరించారు. అలా చేస్తే అది జంతువని పొరబడి దాడిచేసే ప్రమాదం ఉందని భరణి వెల్లడించారు.

Leopard Spotted in Rajahmundry Updates : ఒకవేళ చిరుత ఎవరికైనా దగ్గరగా ఎదురుపడితే చేతులు పైకెత్తి అరుస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్లాలని భరణి పేర్కొన్నారు. దాంతో అది కూడా వెనక్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మరోవైపు నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. కానీ కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. అలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని భరణి సూచించారు.

ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry

'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' - DFO ON LEOPARD ROAMING

Operation Leopard in Rajamahendravaram : గత కొద్దిరోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్​ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరుతను బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇంఛార్జ్​ డీఎఫ్​ఓ భరణి తెలిపారు. దానిని పట్టుకునేందుకు 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కానీ అది మాత్రం ఎక్కడా చిక్కడం లేదని భరణి పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ చిరుత 4 సార్లు మాత్రమే కెమెరాలకు చిక్కిందని భరణి వివరించారు. దాని కదలికలను బట్టి ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సాధారణ డ్రోన్ సహాయంతో చిరుత సంచారాన్ని గాలించినప్పటికీ జాడ కనబడలేదన్నారు. అందుకే థర్మల్ డ్రోన్​ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటువంటి డ్రోన్లు రాత్రిపూట సైతం సమర్థవంతంగా పని చేస్తాయని భరణి వెల్లడించారు.

'ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలి. జాతీయ రహదారిపై స్పీన్లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశాం. చిరుతలు సాధారణంగా జనావాసాల్లోకి రావడం తక్కువ. మనుషుల కంటపడేందుకు ఇష్టపడవు. అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతాయి' అని భరణి వివరించారు.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి : సాధారణంగా చిరుతలు ఒంటరిగా నివసించేందుకే ఇష్టపడతాయని భరణి తెలిపారు. సహచరి, పిల్లలతో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా గుంపుగా తిరుగుతాయని చెప్పారు. ఆవాసాలు దెబ్బతినడం, వేట, నీరు దొరకని సందర్భాల్లో అవి జనావాసాల్లోకి వస్తున్నాయని అన్నారు. ఎవరికైనా చిరుత ఎదురుపడితే పరిగెత్తవద్దని పేర్కొన్నారు. కాస్త దూరంగా ఉండి చేతులు పైకెత్తి, దానివైపు ఓ కన్ను వేసి నెమ్మదిగా వెనక్కి నడవాలని చెప్పారు. కొందరు భయపడి చెట్ల మాటున దాక్కుంటారని అలా చేయవద్దని వివరించారు. అలా చేస్తే అది జంతువని పొరబడి దాడిచేసే ప్రమాదం ఉందని భరణి వెల్లడించారు.

Leopard Spotted in Rajahmundry Updates : ఒకవేళ చిరుత ఎవరికైనా దగ్గరగా ఎదురుపడితే చేతులు పైకెత్తి అరుస్తూ నెమ్మదిగా వెనక్కి వెళ్లాలని భరణి పేర్కొన్నారు. దాంతో అది కూడా వెనక్కి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మరోవైపు నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. కానీ కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. అలాంటి వాటిని ప్రజలు నమ్మవద్దని భరణి సూచించారు.

ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry

'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' - DFO ON LEOPARD ROAMING

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.