ETV Bharat / state

పల్నాడు జిల్లాలో డయేరియా అలజడి- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులు - Diarrhea Cases in Palnadu District

Diarrhea Cases in Palnadu District: పల్నాడు జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. పిడుగురాళ్లలో రెండు రోజుల్లో 15 మందికి డయేరియా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో డయేరియా ప్రబలకుండా అధికారుల అప్రమత్తమై పారిశుద్ధ్యం, తాగునీరు నిర్వహణపై ఆరా తీస్తున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 11:23 AM IST

Diarrhea_Cases_in_Palnadu_District
Diarrhea_Cases_in_Palnadu_District (ETV Bharat)

Diarrhea Cases in Palnadu District: పల్నాడు జిల్లాలో రోజురోజుకు డయేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో 3 నుంచి 5 అతిసారం కేసులు నమోదవగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. పిడుగురాళ్ల , మాచర్ల పట్టణాల్లో ప్రధానంగా వాంతులు, విరోచనాలు లాంటి డయేరియా అనుమానిత లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు.

పిడుగురాళ్లలో వాంతులు, విరేచనాలతో రెండు రోజుల్లోనే 15 మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడం కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందట సిద్ధిక్‌ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తాగునీరు సమస్యతోనే తాము డయేరియా బారిన పడినట్లు ప్రస్తుతం ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని రోగులు చెబుతున్నారు.

పిడుగురాళ్లలో డయేరియా ప్రబలడంతో వైద్యాధికారులు, మున్సిపల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతిసారం అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న మారుతినగర్, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలకు ఉపక్రమించారు. డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండి అతిసారం లక్షణాలతో వస్తున్న బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur

పల్నాడు జిల్లా వైద్యాధికారి రవితేజ, మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు పిడుగురాళ్లలో వైద్య శిబిరానికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు స్థానికంగా అందున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు అనారోగ్యానికి గురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డయేరియా లక్షణాలతో బాధపడుతూ శిబిరానికి వచ్చే వారి సంఖ్య శుక్రవారంతో పోల్చితే శనివారం నాటికి తగ్గిందన్నారు.

"గత మూడు రోజుల నుంచి మారుతినగర్, లెనిన్‌నగర్‌లో ఈ డయేరియా కేసులు అధికంగా వస్తున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులతో మాట్లాడి వ్యాధికి గురవటానికి కారణాలేంటో తెసుకునేందుకు పరిశీలనలు చేపట్టాం. కలుషిత తాగునీటి వలనే ఈ కేసులు అధికమవుతున్నాయని అనుకుంటున్నాం. దీనిపై మరిన్ని వివరాలకోసం టెస్టింగ్​కు పంపించాం. డయేరియా లక్షణాలతో బాధపడుతూ శిబిరానికి వచ్చే వారికి చికిస్త అందిస్తున్నాం." - రవితేజ, పిడుగురాళ్ల ఆస్పత్రి వైద్యుడు

సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities

Diarrhea Cases in Palnadu District: పల్నాడు జిల్లాలో రోజురోజుకు డయేరియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో 3 నుంచి 5 అతిసారం కేసులు నమోదవగా వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. పిడుగురాళ్ల , మాచర్ల పట్టణాల్లో ప్రధానంగా వాంతులు, విరోచనాలు లాంటి డయేరియా అనుమానిత లక్షణాలతో ప్రజలు బాధపడుతున్నారు.

పిడుగురాళ్లలో వాంతులు, విరేచనాలతో రెండు రోజుల్లోనే 15 మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడం కలకలం రేపుతోంది. రెండు రోజుల కిందట సిద్ధిక్‌ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. తాగునీరు సమస్యతోనే తాము డయేరియా బారిన పడినట్లు ప్రస్తుతం ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని రోగులు చెబుతున్నారు.

పిడుగురాళ్లలో డయేరియా ప్రబలడంతో వైద్యాధికారులు, మున్సిపల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతిసారం అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల పాలవుతున్న మారుతినగర్, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలకు ఉపక్రమించారు. డయేరియా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండి అతిసారం లక్షణాలతో వస్తున్న బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur

పల్నాడు జిల్లా వైద్యాధికారి రవితేజ, మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు పిడుగురాళ్లలో వైద్య శిబిరానికి వెళ్లి పరిశీలించారు. బాధితులకు స్థానికంగా అందున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలు అనారోగ్యానికి గురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డయేరియా లక్షణాలతో బాధపడుతూ శిబిరానికి వచ్చే వారి సంఖ్య శుక్రవారంతో పోల్చితే శనివారం నాటికి తగ్గిందన్నారు.

"గత మూడు రోజుల నుంచి మారుతినగర్, లెనిన్‌నగర్‌లో ఈ డయేరియా కేసులు అధికంగా వస్తున్నాయి. దీనిపై మున్సిపల్ అధికారులతో మాట్లాడి వ్యాధికి గురవటానికి కారణాలేంటో తెసుకునేందుకు పరిశీలనలు చేపట్టాం. కలుషిత తాగునీటి వలనే ఈ కేసులు అధికమవుతున్నాయని అనుకుంటున్నాం. దీనిపై మరిన్ని వివరాలకోసం టెస్టింగ్​కు పంపించాం. డయేరియా లక్షణాలతో బాధపడుతూ శిబిరానికి వచ్చే వారికి చికిస్త అందిస్తున్నాం." - రవితేజ, పిడుగురాళ్ల ఆస్పత్రి వైద్యుడు

సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.