ETV Bharat / state

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలి : భట్టి - Deputy CM Bhatti on Annual Budget

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 10:26 PM IST

Deputy CM Bhatti on Agriculture Budget : రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అవసరమయ్యే బడ్జెట్ లెక్కలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఆయిల్ పామ్ సాగు, నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Tummala on Agriculture Budget
Deputy CM Bhatti on Agriculture Budget (ETV Bharat)

Deputy CM Bhatti Review on Agriculture Annual Budget : రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ పథకాలు, రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలు, విత్తన అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. రానున్న సీజన్​లో పంటల బీమాకు టెండర్ల ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై భట్టి విక్రమార్క చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయ అభివృద్ధికి చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే రంగాలపై ఆరా : వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్​కు నిధులు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడ్డారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అవసరమయ్యే బడ్జెట్ లెక్కలపై ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్షించారు. ఆయిల్ పామ్ సాగు, నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు.

Minister Tummala on Agriculture Budget : రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు, సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రయోజనాలు, తదితర అంశాలను అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఏడాదికి రూ.15 వేలు : మంత్రి తుమ్మల - Minister Tummala on Rythu Bharosa

''పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా కల్పించండి - మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి' - Union Budget 2024 Meeting

Deputy CM Bhatti Review on Agriculture Annual Budget : రైతు భరోసాపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించే ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.

గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ పథకాలు, రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలు, విత్తన అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. రానున్న సీజన్​లో పంటల బీమాకు టెండర్ల ప్రక్రియ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై భట్టి విక్రమార్క చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అయితే వ్యవసాయ అభివృద్ధికి చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చే రంగాలపై ఆరా : వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తుల పెరిగి రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూర్చే రంగాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్​కు నిధులు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు అభిప్రాయపడ్డారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలపై ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అవసరమయ్యే బడ్జెట్ లెక్కలపై ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్షించారు. ఆయిల్ పామ్ సాగు, నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తదితర అంశాలపై చర్చించారు.

Minister Tummala on Agriculture Budget : రాష్ట్ర విభజన తర్వాత చేనేత కార్మికుల జీవితాల్లో మార్పులు, సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్ టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రయోజనాలు, తదితర అంశాలను అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం ఏడాదికి రూ.15 వేలు : మంత్రి తుమ్మల - Minister Tummala on Rythu Bharosa

''పాలమూరు-రంగారెడ్డి'కి జాతీయ హోదా కల్పించండి - మూసీ నది ప్రక్షాళనకు నిధులివ్వండి' - Union Budget 2024 Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.