ETV Bharat / state

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili : వైఎస్సార్సీపీ హయాంలో అధికారం అండతో ఆ పార్టీ నేతలు, సహా వారి బంధువులు పలు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలు, చెరువులు దోచుకున్నారు, వందల ఎకరాల భూకబ్జాలు చేశారు. ఈ నేపథ్యం విజయసాయి రెడ్డి కుమార్తెకు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

Once Again Demolitions At Vijayasai Reddy Daughter Place
Once Again Demolitions At Vijayasai Reddy Daughter Place (ETV Bharat)

Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది. అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టారు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ (GVMC) నడుం బిగించింది. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు మొదలు పెట్టారు. సీఆర్​జడ్​ (CRZ) నిబంధనల ఉల్లంఘించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలని న్యాయస్థానం GVMC అధికారులను ఆదేశించింది.

భీమిలిలో సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న నాలుగు 4 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్టు ఆరోపణలతో హైకోర్టులో పీతల మూర్తియాదవ్ పిల్ వేశారు. ఈ పిల్ పై హైకోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పర్యావరణశాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను నెలమట్టం వరకూ కూల్చి వేయాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి జీవీఎంసీ కూల్చివేతలు చేపట్టింది.

నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయండి - అధికారులకు హైకోర్టు ఆదేశం - Neha Reddy Illegal Construction

GVMC shock for Vijaya Sai Reddy : సముద్ర తీరంలో వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్​జెడ్​ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలు తుంగలో తొక్కి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి సముద్రంలో నిర్మించిన అక్రమ ప్రహరీని అధికారులు నేలమట్టం చేశారు. భీమిలి జోన్‌ పట్టణ సహాయ ప్రణాళికాధికారి శ్రీనివాసరావు ఆధ్వరంలో జీవీఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. బీచ్‌ ఒడ్డున హోటల్‌ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించారు.

శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్‌ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy

Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది. అక్రమ నిర్మాణాలు, కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కూల్చివేతలు చేపట్టారు. సీఆర్‌జడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో ఈ చర్యలు తీసుకున్నారు.

విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాల కూల్చివేతకు జీవీఎంసీ (GVMC) నడుం బిగించింది. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు మొదలు పెట్టారు. సీఆర్​జడ్​ (CRZ) నిబంధనల ఉల్లంఘించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేసిన పిల్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతకు అయ్యే ఖర్చులు నేహా రెడ్డి నుంచి వసూలు చేయాలని న్యాయస్థానం GVMC అధికారులను ఆదేశించింది.

భీమిలిలో సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న నాలుగు 4 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్టు ఆరోపణలతో హైకోర్టులో పీతల మూర్తియాదవ్ పిల్ వేశారు. ఈ పిల్ పై హైకోర్టు ఉత్తర్వులతో 2 వారాల క్రితమే నిర్మాణాల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. పర్యావరణశాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్‌ నిర్మాణాలను నెలమట్టం వరకూ కూల్చి వేయాలన్న హైకోర్టు ఆదేశాలతో నేడు మరోసారి జీవీఎంసీ కూల్చివేతలు చేపట్టింది.

నేహారెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేయండి - అధికారులకు హైకోర్టు ఆదేశం - Neha Reddy Illegal Construction

GVMC shock for Vijaya Sai Reddy : సముద్ర తీరంలో వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సీఆర్​జెడ్​ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలు తుంగలో తొక్కి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టి సముద్రంలో నిర్మించిన అక్రమ ప్రహరీని అధికారులు నేలమట్టం చేశారు. భీమిలి జోన్‌ పట్టణ సహాయ ప్రణాళికాధికారి శ్రీనివాసరావు ఆధ్వరంలో జీవీఎంసీ అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. బీచ్‌ ఒడ్డున హోటల్‌ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్‌ పిల్లర్స్‌, గోడలు, ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించారు.

శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్‌ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.