CM Chandrababu Condolence to Dharmapuri Srinivas : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
హూందాగా రాజకీయాలు చేసేవారు : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న ధర్మపురి శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. డీఎస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు. డీఎస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... శ్రీనివాస్… pic.twitter.com/cTpc5rLwLh
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2024
హైదరాబాద్లోని నివాసానికి డీఎస్ భౌతికకాయం - ఆదివారం అంత్యక్రియలు