ETV Bharat / state

సీఎం రేవంత్​తో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్​ భేటీ - కాంగ్రెస్​లో చేరే అవకాశం​ - రేవంత్​తో బొంతు రామ్మోహన్​ భేటీ

Bonthu Rammohan To Join Congress : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​కు వరుస షాక్​లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేరినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Bonthu Rammohan
Bonthu Rammohan To Join Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 5:52 PM IST

Updated : Feb 11, 2024, 10:49 PM IST

Bonthu Rammohan To Join Congress : బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి(BRS Party) గుడ్ బై చెప్పి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు.

సీఎం రేవంత్​ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్​ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్​ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Ex Mayor Bonthu Rammohan Meet CM Revanth Reddy : ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు.

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి దంపతులు - త్వరలోనే కాంగ్రెస్​ గూటికి

BRS Leaders Join in Congress Party : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ పార్టీకి మేటైన ఫలితాలను అందించిన హైదరాబాద్​ మహానగరంలో సైతం ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా, నేతగా కొనసాగిన మాజీ డిప్యూటీ మేయర్‌(Deputy Mayor), ప్రస్తుత బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించిన లేఖలో తెలిపారు.

బీఆర్ఎస్​ను వీడే ప్రసక్తే లేదు : మర్రి జనార్దన్ రెడ్డి

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

Bonthu Rammohan To Join Congress : బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి(BRS Party) గుడ్ బై చెప్పి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్​ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు.

సీఎం రేవంత్​ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే - అసలేం జరుగుతోంది?

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్​ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్​ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Ex Mayor Bonthu Rammohan Meet CM Revanth Reddy : ఇక ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఆ తర్వాత జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవలే మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy) దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. త్వరలోనే వారు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు మహేందర్ రెడ్డి సతీమణి తెలిపారు.

సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి దంపతులు - త్వరలోనే కాంగ్రెస్​ గూటికి

BRS Leaders Join in Congress Party : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ పార్టీకి మేటైన ఫలితాలను అందించిన హైదరాబాద్​ మహానగరంలో సైతం ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా, నేతగా కొనసాగిన మాజీ డిప్యూటీ మేయర్‌(Deputy Mayor), ప్రస్తుత బోరబండ కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించిన లేఖలో తెలిపారు.

బీఆర్ఎస్​ను వీడే ప్రసక్తే లేదు : మర్రి జనార్దన్ రెడ్డి

'ఆ 14 స్థానాల్లో మేమే'- గట్టి షాకిచ్చిన కేజ్రీవాల్- ఇండియా కూటమి కుదేల్​!

Last Updated : Feb 11, 2024, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.