ETV Bharat / state

తిరుపతిలో​ హోటల్​కు బాంబ్​ బెదిరింపు - తనిఖీలు చేపట్టిన పోలీసులు

ప్రత్యేక బృందాల పర్యవేక్షణలో అణువణువు తనిఖీ

Bomb threats to several hotels in Tirupati
Bomb threats to Raj Park hotel in Tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Bomb threats to several hotels in Tirupati: తిరుపతి నగరంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. నగరంలోని రాజ్​పార్కు హోటల్​కు బాంబు బెదిరింపు కాల్​ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో మూజు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్​తో తనిఖీలు చేపట్టారు. ఆ హోటళ్లలోని మూలమూలలా గాలించారు. చివరకు ఎటువంటి బాంబు లేదని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు

అదే విధంగా రామానుజ కూడలిలోని మరో హోటల్​కు సైతం గురువారం మెయిల్​లో అపరిచిత వ్యక్తుల సుమారు నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా కూడా పేలుడు సామగ్రి లేవని నిర్థారించుకుని ఊరట చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మళ్లీ మూడు విమానాలకు బాంబు బెదిరింపు

కొనసాగుతున్న పోలీసుల సమగ్ర దర్యాప్తు: ఇవే కాకుండా తిరుపతిలోని పలు హోటళ్లలో కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామని మెయిళ్లు ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఒకవేళ దీని వెనుక ఎవరైనా ఆకతాయిలు ఉన్నారా? లేక తీవ్రవాదులు ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం దీనిపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది.

గతంలో కర్ణాటక నుంచి తిరుపతి వచ్చే స్టార్​ ఎయిర్​లైన్స్​ విమానానికి బాంబు బెదింపు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం విధితమే.

ఆగని బాంబు బెదిరింపులు - ఒక్క రోజే 24 విమానాలకు!

బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks

Bomb threats to several hotels in Tirupati: తిరుపతి నగరంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. నగరంలోని రాజ్​పార్కు హోటల్​కు బాంబు బెదిరింపు కాల్​ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరో మూజు హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు, బాంబ్ స్వ్కాడ్​తో తనిఖీలు చేపట్టారు. ఆ హోటళ్లలోని మూలమూలలా గాలించారు. చివరకు ఎటువంటి బాంబు లేదని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

'విమానంలో బాంబు ఉందని బెదిరిస్తే జైలు శిక్ష'- కొత్త రూల్స్ ప్రకటించిన రామ్మోహన్ నాయుడు

అదే విధంగా రామానుజ కూడలిలోని మరో హోటల్​కు సైతం గురువారం మెయిల్​లో అపరిచిత వ్యక్తుల సుమారు నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా కూడా పేలుడు సామగ్రి లేవని నిర్థారించుకుని ఊరట చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మళ్లీ మూడు విమానాలకు బాంబు బెదిరింపు

కొనసాగుతున్న పోలీసుల సమగ్ర దర్యాప్తు: ఇవే కాకుండా తిరుపతిలోని పలు హోటళ్లలో కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామని మెయిళ్లు ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఒకవేళ దీని వెనుక ఎవరైనా ఆకతాయిలు ఉన్నారా? లేక తీవ్రవాదులు ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం దీనిపై సమగ్ర విచారణ కొనసాగిస్తోంది.

గతంలో కర్ణాటక నుంచి తిరుపతి వచ్చే స్టార్​ ఎయిర్​లైన్స్​ విమానానికి బాంబు బెదింపు అప్పట్లో కలకలం సృష్టించిన విషయం విధితమే.

ఆగని బాంబు బెదిరింపులు - ఒక్క రోజే 24 విమానాలకు!

బాంబుల మోతతో దద్దరిల్లిన తంగెడ- భయంతో గజగజలాడిన స్థానికులు - YSRCP Activists Bomb Attacks

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.