ETV Bharat / state

గుంటూరు డీసీసీ బ్యాంకులో అక్రమాలు - నకిలీ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతల రుణాలు - Big Scam In Guntur GDCC Bank

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 2:18 PM IST

Big Scam In Guntur GDCC Bank On Farmer Loans : గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అక్రమార్కులకు అడ్డాగా మారింది. జనం సొమ్ము కొట్టేయడమే పనిగా పెట్టుకున్న కొందరు మోసగాళ్లకు బ్యాంకు యంత్రాంగం సహకరిస్తోంది. నకిలీ పాసుపుస్తకాలు, నకిలీ ఆధార్‌ కార్డులు పెట్టి భారీగా బ్యాంకు సొమ్మును నొక్కేశారు. తాజాగా శీతల గోదాములో మిర్చిని చూపించి తీసుకున్న రుణంలో అవకతవకలు వెలుగులోకొచ్చాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

big_scam_in_guntur_gdcc_bank_on_farmer_loans
big_scam_in_guntur_gdcc_bank_on_farmer_loans (ETV Bharat)

Big Scam In Guntur GDCC Bank On Farmer Loans : రైతులు, మహిళా సంఘాలకు ఊతంగా నిలవాల్సిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీలకు ఎన్నికలను నిర్వహించకుండా పాలక వర్గాలను నామినేట్‌ చేయడంతో అక్రమాలకు పునాది పడింది. అప్పటి ఛైర్మన్ సహా కొందరు వైఎస్సార్సీపీ నేతలు చేసిన అక్రమాల తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

నకిలీ ఆధార్‌ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడుతోంది. గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడులోని జీడీసీసీ (Guntur District Co-Operative Central) బ్యాంకులో 70 కోట్ల రూపాయల రుణాలిచ్చారు. ఒక శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న మిర్చికి ఏకంగా 53 కోట్ల రుణం ఇచ్చారు. 2022-23లో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులిస్తున్నారు. సిద్ధార్థ అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీడంతో ఆయన పేరున ఉన్న 10 లక్షల మొత్తాన్ని శీతల గిడ్డంగివారి నుంచి జమ చేయించేందుకు ప్రయత్నించారు.

ఓ సినీ నిర్మాత స్వీయ దర్శకత్వంలో - ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల 'స్కామ్​ కథా చిత్రం' - TELUGU FILM PRODUCER FRAUD

'బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ నకిలీ పాసుపుస్తకాలు పెట్టి 11కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పల్నాడు జిల్లాలో శీతలగిడ్డంగిలో ఉన్న సరకుకు చూపి 50 మంది రైతుల పేర్లతో యజమాని 5కోట్ల రూపాయల వరకు రుణం తీసుకుని చెల్లించలేదు. గుంటూరు నగరానికి చెందిన వైఎస్సార్సీపీ కీలక ప్రజాప్రతినిధి బంధువు ఒకరు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు సృష్టించి అడ్డా కూలీలు, రోజువారీ కూలీ చేసుకునే మహిళలకు డబ్బు ఆశ చూపి వారి పేర్లతో సొసైటీల్లో రుణాలు పొందారు. జీడీసీసీ (GDCC) బ్యాంకు నిధులను లోన్ల రూపంలో కాజేసిన వారిని వదిలిపెట్టేది లేదు.' - తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ ఎమ్మెల్యే

రుణాలు మంజూరు విషయంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవటం దారుణమని నిపుణులు అంటున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటవంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

అపాయింట్​మెంట్​ లెటర్​ ఇచ్చారు, ఆఫీస్​లోకి రానివ్వలేదు - అసలు విషయం తెలిసి షాక్​ - Fraud in the Name of Jobs

Big Scam In Guntur GDCC Bank On Farmer Loans : రైతులు, మహిళా సంఘాలకు ఊతంగా నిలవాల్సిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కొందరు రాజకీయ నేతలు, అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీలకు ఎన్నికలను నిర్వహించకుండా పాలక వర్గాలను నామినేట్‌ చేయడంతో అక్రమాలకు పునాది పడింది. అప్పటి ఛైర్మన్ సహా కొందరు వైఎస్సార్సీపీ నేతలు చేసిన అక్రమాల తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

నకిలీ ఆధార్‌ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు పెట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం బయటపడుతోంది. గుంటూరు గ్రామీణ మండలం నల్లపాడులోని జీడీసీసీ (Guntur District Co-Operative Central) బ్యాంకులో 70 కోట్ల రూపాయల రుణాలిచ్చారు. ఒక శీతల గిడ్డంగిలో నిల్వ ఉన్న మిర్చికి ఏకంగా 53 కోట్ల రుణం ఇచ్చారు. 2022-23లో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులిస్తున్నారు. సిద్ధార్థ అనే వ్యక్తి బ్యాంకుకు వచ్చి అధికారులను నిలదీడంతో ఆయన పేరున ఉన్న 10 లక్షల మొత్తాన్ని శీతల గిడ్డంగివారి నుంచి జమ చేయించేందుకు ప్రయత్నించారు.

ఓ సినీ నిర్మాత స్వీయ దర్శకత్వంలో - ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల 'స్కామ్​ కథా చిత్రం' - TELUGU FILM PRODUCER FRAUD

'బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ నకిలీ పాసుపుస్తకాలు పెట్టి 11కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. పల్నాడు జిల్లాలో శీతలగిడ్డంగిలో ఉన్న సరకుకు చూపి 50 మంది రైతుల పేర్లతో యజమాని 5కోట్ల రూపాయల వరకు రుణం తీసుకుని చెల్లించలేదు. గుంటూరు నగరానికి చెందిన వైఎస్సార్సీపీ కీలక ప్రజాప్రతినిధి బంధువు ఒకరు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు సృష్టించి అడ్డా కూలీలు, రోజువారీ కూలీ చేసుకునే మహిళలకు డబ్బు ఆశ చూపి వారి పేర్లతో సొసైటీల్లో రుణాలు పొందారు. జీడీసీసీ (GDCC) బ్యాంకు నిధులను లోన్ల రూపంలో కాజేసిన వారిని వదిలిపెట్టేది లేదు.' - తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ ఎమ్మెల్యే

రుణాలు మంజూరు విషయంలో అధికారులు కనీస నిబంధనలు పాటించకపోవటం దారుణమని నిపుణులు అంటున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటవంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

అపాయింట్​మెంట్​ లెటర్​ ఇచ్చారు, ఆఫీస్​లోకి రానివ్వలేదు - అసలు విషయం తెలిసి షాక్​ - Fraud in the Name of Jobs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.