ETV Bharat / state

రికార్డు స్థాయి నామినేషన్లపై ఈసీ స్క్రూటినీ- వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్‌ తిరస్కరణ - Nominations Scrutiny

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 5:01 PM IST

Updated : Apr 26, 2024, 9:17 PM IST

Nominations Scrutiny : రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా రికార్డు స్థాయిలో నామినేషన్ల దాఖలయ్యాయి. పార్లమెంట్ స్థానాలకు 1,103 నామినేషన్లు, అసెంబ్లీ కోసం 5993 నామినేషన్లు దాఖలైయ్యాయని అధికారులు వెెల్లడించారు. పరిశీలన అనంతరం పోటీలో నిలువనున్న తుది అభ్యర్థుల జాబితాను ఈ నెల 29న ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Nominations_Scrutiny
Nominations_Scrutiny

Nominations Scrutiny : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామపత్రాల పరిశీలన జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన వివరాలు లేనందున డోన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి అధికారులు ఆమోదించడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి పెండింగ్‌లో ఉంచారు. ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కుమారుడి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

కొడాలి నాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం - పెండింగ్​లో బుగ్గన నామినేషన్​

అనకాపల్లి జిల్లా పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ నామినేషన్‌ను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసులను ప్రస్తావించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ఫిర్యాదు చేయగా. కేసుల వివరాలు పొందుపర్చలేదని అధికారులు గుర్తించారు. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని అదీప్‌రాజ్‌కు రిటర్నింగ్‌ అధికారి సమయమిచ్చారు.

బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారు : నంద్యాల జిల్లా డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్‌పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు. అఫిడవిట్ లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గన నామినేషన్​ను పెండింగ్ ఉంచారు. అయితే సాయంత్రంలోగా అధికారులు నామినేషన్​కు ఆమోదం తెలిపారు. బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్ పై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. దీంతో మెుదట కిషోర్ రెడ్డి నామినేషన్​ను ఆపిన అధికారులు తరువాత ఆమోదించారు.

కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం : కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలుగుదేశం నేతలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు ఆఫీసుగా వినియోగించారని ఆ విషయాన్ని అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని టీడీపీ నాయకుడు తులసి ఆరోపించారు. అంతేకాకా తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని నాని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. నాని మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు పురపాలక అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదుతో పాటు సమర్పించారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందున కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నామిననేషన్‌ తిరస్కరించకుండా ఆర్వో ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

నామినేషన్‌ పరిశీలనలో తీవ్ర ఉద్రిక్త : అనంతపురం జిల్లా తాడిపత్రిలో నామినేషన్‌ పరిశీలన వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా వైసీపీ నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులు తమని పంపిచకుండా వైసీపీ వాళ్లని ఎలా పంపుతారని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.

పెండింగ్​లో బుగ్గన - వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్‌ తిరస్కరణ - Nominations Scrutiny

ఆఖరి రోజు జోరుగా నామినేషన్లు - భారీ ర్యాలీలతో హోరెత్తిస్తున్న నేతలు - last Day Nominations

రికార్డు స్థాయిలో దాఖలైన నామినేషన్లు - వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్‌ తిరస్కరణ

Nominations Scrutiny : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల నామపత్రాల పరిశీలన జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సరైన వివరాలు లేనందున డోన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి అధికారులు ఆమోదించడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి పెండింగ్‌లో ఉంచారు. ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు కుమారుడి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

కొడాలి నాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం - పెండింగ్​లో బుగ్గన నామినేషన్​

అనకాపల్లి జిల్లా పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్ నామినేషన్‌ను అధికారులు పెండింగ్‌లో ఉంచారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసులను ప్రస్తావించలేదని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ఫిర్యాదు చేయగా. కేసుల వివరాలు పొందుపర్చలేదని అధికారులు గుర్తించారు. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని అదీప్‌రాజ్‌కు రిటర్నింగ్‌ అధికారి సమయమిచ్చారు.

బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారు : నంద్యాల జిల్లా డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అఫిడవిట్‌పై తెలుగుదేశం నేతలు అభ్యంతరం తెలిపారు. అఫిడవిట్ లో అన్ని ఆస్తుల వివరాలు చూపించలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారి బుగ్గన నామినేషన్​ను పెండింగ్ ఉంచారు. అయితే సాయంత్రంలోగా అధికారులు నామినేషన్​కు ఆమోదం తెలిపారు. బుగ్గనకు ఆర్వో అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అఫిడవిట్ పై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. దీంతో మెుదట కిషోర్ రెడ్డి నామినేషన్​ను ఆపిన అధికారులు తరువాత ఆమోదించారు.

కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం : కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలుగుదేశం నేతలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు ఆఫీసుగా వినియోగించారని ఆ విషయాన్ని అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని టీడీపీ నాయకుడు తులసి ఆరోపించారు. అంతేకాకా తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని నాని అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. నాని మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు పురపాలక అధికారులు ఇచ్చిన పత్రాలను ఫిర్యాదుతో పాటు సమర్పించారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందున కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ నామిననేషన్‌ తిరస్కరించకుండా ఆర్వో ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

నామినేషన్‌ పరిశీలనలో తీవ్ర ఉద్రిక్త : అనంతపురం జిల్లా తాడిపత్రిలో నామినేషన్‌ పరిశీలన వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుండగా వైసీపీ నాయకులు లోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులు తమని పంపిచకుండా వైసీపీ వాళ్లని ఎలా పంపుతారని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.

పెండింగ్​లో బుగ్గన - వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్‌ తిరస్కరణ - Nominations Scrutiny

ఆఖరి రోజు జోరుగా నామినేషన్లు - భారీ ర్యాలీలతో హోరెత్తిస్తున్న నేతలు - last Day Nominations

రికార్డు స్థాయిలో దాఖలైన నామినేషన్లు - వివేకా హత్య కేసు నిందితుడి నామినేషన్‌ తిరస్కరణ
Last Updated : Apr 26, 2024, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.