ETV Bharat / state

ఎగ్జిట్ పోల్స్ - ఏపీలో ఏ పార్టీకి ఎన్ని లోక్​సభ స్థానాలంటే! - Lok Sabha Exit Polls Result 2024

AP Exit Polls Result 2024: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమికి సర్వే సంస్థలు పట్టం కట్టాయి. ఏపీలో తెలుగుదేశం తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచానాలు వేశాయి.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 6:52 PM IST

Updated : Jun 1, 2024, 8:47 PM IST

AP Exit Polls Result 2024
AP Exit Polls Result 2024 (ETV Bharat)

AP Exit Polls Result 2024: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమికి సర్వే సంస్థలు పట్టం కట్టాయి. ఏపీలో తెలుగుదేశం తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచానాలు వేశాయి. ఏపీలో కూటమి దెబ్బకు వైఎస్సార్సీపీ చతికిలపడుతుందనిన సర్వే సంస్థలు జోష్యం చెప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్‌ కొడుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. ఎన్డీఏకు మూడొందలకుపైగా సీట్లు వస్తాయన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వెల్లడిచేశాయి. ఇండియా కూటమి ఎన్డీఏ దరిదాపుల్లోకి రాదని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి.

AP Exit Polls Result 2024
AP Exit Polls Result 2024 (ETV Bharat)

ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్​... గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్నదుంకుటుందంని చెప్పిన కేకే సర్వేస్‌ అనే సంస్థ, ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నట్లు కేకే సర్వేస్‌ తెలిపింది. వైఎస్సార్సీపీ ఒక్కటంటే ఒక్కసీటూ గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన2, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని.. వెల్లడించింది.

చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం కూడా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభ విషయానికొస్తే.. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా.. వైఎస్సార్సీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని.. వెల్లడించింది.

తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు. పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైఎస్సార్సీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది.

జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించే ఇండియా టీవీ కూడా, రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, భాజపా 4 నుంచి6, జనసేన 2 సీట్లు గెలుచకుంటుందని తెలిపింది. ఇక వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని.. అంచనా వేసింది.

సీఎన్ఎక్స్ అనే సంస్థ కూడా, కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15 , భాజపా 4 నుంచి6, జనసేన 2, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని.. తెలిపింది.

ఏబీపీ - సీ ఓటర్‌ సంస్థ తెలుగుదేశం కూయటకి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా.. వైఎస్సార్సీపీ నాలుగు స్థానాల వరకూ గెలుచుకోవచ్చని తెలిపింది.

ఇండియా న్యూస్- డీ-డైనమిక్స్‌ కూడా.. .తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకోనుండగా... వైఎస్సార్సీపీ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

న్యూస్‌-18 సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది. తెదేపా కూటమి అత్యధికంగా 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకోనుండగా.. వైఎస్సార్సీపీ 5 నుంచి 8 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది.

మరో జాతీయ సంస్థ టుడేస్‌ చాణక్య కూడా.. తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది. ఆ కూటమి 19నుంచి 25 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ సున్నా నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చని.. తెలిపింది.

జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ మాత్రం వైఎస్సార్సీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది. తెలుగుదేశం 7 నుంచి 9 స్థానాలు, జనసేన 1, భాజపా 2 సీట్లు కైవసం చేసుకుంటాయని.. అంచనా వేసింది.

రైజ్‌ ఎగ్జిట్‌పోల్స్ సంస్థ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఏపీలో 17-20, సీట్లు వస్తాయని పేర్కొంది. వైఎస్సార్సీపీకి కేవలం 7-10 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

AP Exit Polls Result 2024: లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. సాయంత్రం 6.30కు ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమికి సర్వే సంస్థలు పట్టం కట్టాయి. ఏపీలో తెలుగుదేశం తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచానాలు వేశాయి. ఏపీలో కూటమి దెబ్బకు వైఎస్సార్సీపీ చతికిలపడుతుందనిన సర్వే సంస్థలు జోష్యం చెప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్‌ కొడుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. ఎన్డీఏకు మూడొందలకుపైగా సీట్లు వస్తాయన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వెల్లడిచేశాయి. ఇండియా కూటమి ఎన్డీఏ దరిదాపుల్లోకి రాదని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి.

AP Exit Polls Result 2024
AP Exit Polls Result 2024 (ETV Bharat)

ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌పోల్స్​... గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకపక్ష విజయాన్నదుంకుటుందంని చెప్పిన కేకే సర్వేస్‌ అనే సంస్థ, ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్‌ స్వీప్‌ చేయబోతున్నట్లు కేకే సర్వేస్‌ తెలిపింది. వైఎస్సార్సీపీ ఒక్కటంటే ఒక్కసీటూ గెలుచుకోలేదని, తెలుగుదేశం 17, జనసేన2, భాజపా 6 స్థానాలు కైవసం చేసుకుంటాయని.. వెల్లడించింది.

చాణక్య స్ట్రాటజీస్‌ సర్వే ప్రకారం కూడా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సభ విషయానికొస్తే.. తెలుగుదేశం కూటమి అత్యధికంగా 17 నుంచి 18 సీట్లు దక్కించుకోనుండగా.. వైఎస్సార్సీపీ 6 నుంచి 7 స్థానాలకే పరిమితం కాబోతోందని.. వెల్లడించింది.

తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్నందుకోబోతున్నట్లు. పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది. లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 20, వైఎస్సార్సీపీ 5 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది.

జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించే ఇండియా టీవీ కూడా, రాష్ట్రంలో కూటమిదే ఆధిపత్యమని తేల్చింది. 25 లోక్‌సభ సీట్లలో తెలుగుదేశం 13 నుంచి 15, భాజపా 4 నుంచి6, జనసేన 2 సీట్లు గెలుచకుంటుందని తెలిపింది. ఇక వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని.. అంచనా వేసింది.

సీఎన్ఎక్స్ అనే సంస్థ కూడా, కూటమిదే హవా అని తేల్చింది. తెలుగుదేశం 13 నుంచి 15 , భాజపా 4 నుంచి6, జనసేన 2, వైఎస్సార్సీపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకుంటాయని.. తెలిపింది.

ఏబీపీ - సీ ఓటర్‌ సంస్థ తెలుగుదేశం కూయటకి 21 నుంచి 25 స్థానాలు కట్టబెట్టగా.. వైఎస్సార్సీపీ నాలుగు స్థానాల వరకూ గెలుచుకోవచ్చని తెలిపింది.

ఇండియా న్యూస్- డీ-డైనమిక్స్‌ కూడా.. .తెలుగుదేశం కూటమి 18 స్థానాలు గెలుచుకోనుండగా... వైఎస్సార్సీపీ 7 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

న్యూస్‌-18 సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది. తెదేపా కూటమి అత్యధికంగా 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకోనుండగా.. వైఎస్సార్సీపీ 5 నుంచి 8 స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది.

మరో జాతీయ సంస్థ టుడేస్‌ చాణక్య కూడా.. తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది. ఆ కూటమి 19నుంచి 25 స్థానాలు గెలుచుకోనుండగా వైఎస్సార్సీపీ సున్నా నుంచి 6 స్థానాలు దక్కించుకోవచ్చని.. తెలిపింది.

జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ మాత్రం వైఎస్సార్సీపీకి 13 నుంచి 15 లోక్‌సభ స్థానాలు గెలవొచ్చని తెలిపింది. తెలుగుదేశం 7 నుంచి 9 స్థానాలు, జనసేన 1, భాజపా 2 సీట్లు కైవసం చేసుకుంటాయని.. అంచనా వేసింది.

రైజ్‌ ఎగ్జిట్‌పోల్స్ సంస్థ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఏపీలో 17-20, సీట్లు వస్తాయని పేర్కొంది. వైఎస్సార్సీపీకి కేవలం 7-10 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

Last Updated : Jun 1, 2024, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.