ETV Bharat / state

ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్ - ఆ కేసును క్వాష్ చేయాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అల్లు అర్జున్‌ పిటిషన్‌ దాఖలు - తనపై ఉన్న కేసును క్వాష్‌ చేయాలని కోరారు

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Allu Srjun Filed petition in Ap High Court
Allu Srjun Filed petition in Ap High Court (ETV Bharat)

Allu Arjun petition in AP High Court : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా నేడు విచారణ జరగనుంది.

Allu Arjun Huge Rally In Nandyala in AP Elections : మే 11న నటుడు అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం దుమారమే లేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులపై కొరడా ఝుళిపించింది. నంద్యాలలో ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, డీఎస్పీ ఎన్‌. రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజా రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది. వారిపై 60రోజుల్లో శాఖాపరమైన విచారణ చేయాలని సూచించింది

అల్లు అర్జున్​ ఏపీలో ఎన్నికల ప్రచార వివాదం - ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు - EC Action on Allu Arjun Campaign

Case on Allu Arjun at Nandyala in Andhra Pradesh : ఎలాంటి అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నటుడు అల్లు అర్జున్‌ సహా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే?

1600 కి.మీ సైకిల్ జర్నీ- బన్నీని కలిసేందుకు ఫ్యాన్ క్రేజీ ఫీట్

Allu Arjun petition in AP High Court : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించగా నేడు విచారణ జరగనుంది.

Allu Arjun Huge Rally In Nandyala in AP Elections : మే 11న నటుడు అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్‌ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం దుమారమే లేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులపై కొరడా ఝుళిపించింది. నంద్యాలలో ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, డీఎస్పీ ఎన్‌. రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజా రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది. వారిపై 60రోజుల్లో శాఖాపరమైన విచారణ చేయాలని సూచించింది

అల్లు అర్జున్​ ఏపీలో ఎన్నికల ప్రచార వివాదం - ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు - EC Action on Allu Arjun Campaign

Case on Allu Arjun at Nandyala in Andhra Pradesh : ఎలాంటి అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో నటుడు అల్లు అర్జున్‌ సహా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే?

1600 కి.మీ సైకిల్ జర్నీ- బన్నీని కలిసేందుకు ఫ్యాన్ క్రేజీ ఫీట్

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.