ETV Bharat / sports

ఆఫర్​ ధరల్లో భారత్​-ఇంగ్లాండ్​ తొలి టెస్ట్ మ్యాచ్​ టికెట్లు- ఆ స్టూడెంట్స్​కు ఫ్రీ ఎంట్రీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 7:16 PM IST

Offers On Ind Vs Eng Test Hyd Match Tickets : గురువారం హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం వేదికగా భారత్​-ఇంగ్లాండ్​ జట్ల మధ్య 5 టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నరకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ సిరీస్​లో భాగంగా తొలి టెస్టుకు సంబంధించి ఇప్పటికే టికెట్​ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిపై పలు రకాల ఆఫర్​లు, మినహాయింపులను కల్పిస్తోంది హెచ్​సీఏ​.

Offers On Ind Vs Eng Test Hyd Match Tickets
Offers On Ind Vs Eng Test Hyd Match Tickets

Offers On Ind Vs Eng Test Hyd Match Tickets : జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరిగే 5 టెస్టుల సుదీర్ఘ సరీస్​ కోసం ఇంగ్లాండ్​-భారత్​ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి 29 వరకు తొలి టెస్టు హైదరాబాద్​లో ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్​ చేరుకున్న రెండు టీమ్స్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లతో బిజీగా గడుపుతున్నాయి. మ్యాచ్​ను వీక్షించేందుకు అవసరమైన టికెట్ల విక్రయాలను జనవరి 18నుంచే ప్రారంభించింది హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్(హెచ్​సీఏ). ఈ నేపథ్యంలో 5 రోజులపాటు సాగనున్న మొదటి టెస్టు మ్యాచ్​ టికెట్లపై పలు రకాల ఆఫర్లను ప్రకటించింది.

3 రోజుల టికెట్​ ధరతో 5 రోజులు
5 రోజుల పాటు జరగనున్న తొలి టెస్టు మ్యాచ్​ టికెట్​ ధరలను కనిష్ఠంగా రూ.200 నుంచి గరిష్ఠంగా రూ.4,000 వరకు నిర్ణయించింది హెచ్​సీఏ. ప్యాకేజీ రూపంలో తక్కువ ధరకే టికెట్లు

  • రూ.200(ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.600కే లభిస్తున్నాయి.
  • రూ.1000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.3వేలకే అందుబాటులో ఉంచారు.
  • రూ.1250 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.3750.
  • రూ.3,000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.12వేలు.
  • రూ.4,000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.16,000.

సికింద్రాబాద్​లోని జింఖానా గ్రౌండ్స్​తో పాటు ఇన్‌సైడర్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో, పేటీఎం, పేటీఎంఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌లోనూ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

విద్యార్థులకు ప్రవేశం ఉచితం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ మ్యాచ్‌లను ఉచితంగానే చూపించనున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు మాత్రమే ఈ అవకాశం లభించనుంది. ప్రతిరోజు 5వేల మంది విద్యార్థులకు మ్యాచ్​లను చూసేందుకు ఛాన్స్​ ఇవ్వనున్నారు. వీరికి ఉచితంగానే భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.

రిపబ్లిక్​ డే సందర్భంగా వారికి ఫ్రీ
జవనరి 26న రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని ఆర్మీ, నేవీ అధికారులకు ఈ టెస్ట్‌ మ్యాచ్‌ను ఉచితంగానే చూసేందుకు అవకాశం కల్పించారు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు.

వరుణ్​ తేజ్​కు ఆ సమస్య ఉంది! : లావణ్య త్రిపాఠి

వికెట్​ కీపర్​గా కేఎల్​ రాహుల్​ ఔట్​- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్​ దక్కేనా?

Offers On Ind Vs Eng Test Hyd Match Tickets : జనవరి 25 నుంచి మార్చి 11 వరకు జరిగే 5 టెస్టుల సుదీర్ఘ సరీస్​ కోసం ఇంగ్లాండ్​-భారత్​ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి 29 వరకు తొలి టెస్టు హైదరాబాద్​లో ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్​ చేరుకున్న రెండు టీమ్స్​ ప్రాక్టీస్​ మ్యాచ్​లతో బిజీగా గడుపుతున్నాయి. మ్యాచ్​ను వీక్షించేందుకు అవసరమైన టికెట్ల విక్రయాలను జనవరి 18నుంచే ప్రారంభించింది హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్(హెచ్​సీఏ). ఈ నేపథ్యంలో 5 రోజులపాటు సాగనున్న మొదటి టెస్టు మ్యాచ్​ టికెట్లపై పలు రకాల ఆఫర్లను ప్రకటించింది.

3 రోజుల టికెట్​ ధరతో 5 రోజులు
5 రోజుల పాటు జరగనున్న తొలి టెస్టు మ్యాచ్​ టికెట్​ ధరలను కనిష్ఠంగా రూ.200 నుంచి గరిష్ఠంగా రూ.4,000 వరకు నిర్ణయించింది హెచ్​సీఏ. ప్యాకేజీ రూపంలో తక్కువ ధరకే టికెట్లు

  • రూ.200(ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.600కే లభిస్తున్నాయి.
  • రూ.1000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.3వేలకే అందుబాటులో ఉంచారు.
  • రూ.1250 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.3750.
  • రూ.3,000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.12వేలు.
  • రూ.4,000 (ఒక్కరోజుకు) టికెట్‌ 5 రోజులకు కలిపి కేవలం రూ.16,000.

సికింద్రాబాద్​లోని జింఖానా గ్రౌండ్స్​తో పాటు ఇన్‌సైడర్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో, పేటీఎం, పేటీఎంఇన్‌సైడర్‌ మొబైల్‌ యాప్‌లోనూ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

విద్యార్థులకు ప్రవేశం ఉచితం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ మ్యాచ్‌లను ఉచితంగానే చూపించనున్నారు. ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలకు మాత్రమే ఈ అవకాశం లభించనుంది. ప్రతిరోజు 5వేల మంది విద్యార్థులకు మ్యాచ్​లను చూసేందుకు ఛాన్స్​ ఇవ్వనున్నారు. వీరికి ఉచితంగానే భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు.

రిపబ్లిక్​ డే సందర్భంగా వారికి ఫ్రీ
జవనరి 26న రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని ఆర్మీ, నేవీ అధికారులకు ఈ టెస్ట్‌ మ్యాచ్‌ను ఉచితంగానే చూసేందుకు అవకాశం కల్పించారు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ను ఉచితంగా చూడవచ్చు.

వరుణ్​ తేజ్​కు ఆ సమస్య ఉంది! : లావణ్య త్రిపాఠి

వికెట్​ కీపర్​గా కేఎల్​ రాహుల్​ ఔట్​- ఆంధ్ర కుర్రోడికి ఛాన్స్​ దక్కేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.