ETV Bharat / politics

వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్​కు లేదు - వైఎస్సార్సీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu Fire on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 7:58 PM IST

Updated : Jul 20, 2024, 9:44 PM IST

TDP Parliamentary Meeting on Jagan Comments: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. వినుకొండ వేదికగా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదామని స్పష్టం చేశారు. దిల్లీ వేదికగానే తాము కూడా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని ఎంపీలు తేల్చి చెప్పారు.

TDP Parliamentary Meeting on Jagan Comments
TDP Parliamentary Meeting on Jagan Comments (ETV Bharat)

CM Chandrababu Fire on Jagan Comments : ఈ నెల 22 (సోమవారం) నుంచి పార్లమెంట్​ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పని చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని తిప్పికొడదాం : అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దిల్లీ డ్రామాలని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్​కు లేదని అన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి, మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు కార్పొరేషన్​లకే నిధులన్నీ మళ్లించేశాడని విమర్శించారు. నిర్మాణాత్మకంగా రాష్ట్రాభివృద్ధిని సవాల్​గా తీసుకుని పని చేద్దామని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండా - ఎంపీలు పోటీ పడి పని చేయాలి: సీఎం చంద్రబాబు - TDP Parliamentary meeting

పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్‌ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైఎస్సార్సీపీ నేతలూ ఒప్పుకున్నారని చంద్రబాబు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదామని అన్నారు. వ్యక్తిగతదాడులకు జగన్‌ రాజకీయ రంగు పులుముతున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు, పోలీసులు కఠినంగా ఉండాలని తెలిపారు. తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు.

జగన్ హింసా రాజకీయాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుచేస్తే తప్పించుకోలేం అనే భయం కల్పిస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు తిరస్కరించినా జగన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. జగన్ బెదిరింపులకు భయపడం కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్‌, నక్సలిజం, రౌడీయిజాన్ని అదుపు చేసిన చరిత్ర టీడీపీదన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తెస్తామని వెల్లడించారు.

రాజకీయ రంగు పులుముతున్నారు : 35 మంది హత్యకు గురయ్యారని చెబుతున్న జగన్ వారి వివరాలు ఇవ్వగలరా అని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. పూర్తి అవాస్తవాలను జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండ ఘటనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆక్షేపించారు. వినుకొండ ఘటన గ్రూపుల గొడవని, రెండున్నరేళ్ల నుంచి ఆ గ్రూపుల మధ్య గొడవ జరుగుతూనే ఉందని ఆరోపించారు.

జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం : ఏపీలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు రాజకీయ హత్యల్లో తెలుగుదేశం నేతలు బాధితులుగా ఉన్నారని వాపోయారు. దిల్లీ వేదికగానే తాము కూడా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు జగన్ దిల్లీ నాటకం: నాగబాబు - Naga Babu Fire on Jagan Comments

శాంతి భద్రతలు ఏమీ బాగోలేవు : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్‌ చెప్పారు. గత నెల రోజులు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుగుతున్నామని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇస్తే రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి వివరిస్తామని వెల్లడించారు.

ఫేక్​ పాలిటిక్స్ బ్రాండ్​ అంబాసిడర్​ జగన్​ - ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు - jagan fake publicity

CM Chandrababu Fire on Jagan Comments : ఈ నెల 22 (సోమవారం) నుంచి పార్లమెంట్​ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీ పడి పని చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని తిప్పికొడదాం : అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి దిల్లీ డ్రామాలని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్​కు లేదని అన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి, మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు కార్పొరేషన్​లకే నిధులన్నీ మళ్లించేశాడని విమర్శించారు. నిర్మాణాత్మకంగా రాష్ట్రాభివృద్ధిని సవాల్​గా తీసుకుని పని చేద్దామని పిలుపునిచ్చారు.

రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండా - ఎంపీలు పోటీ పడి పని చేయాలి: సీఎం చంద్రబాబు - TDP Parliamentary meeting

పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్‌ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైఎస్సార్సీపీ నేతలూ ఒప్పుకున్నారని చంద్రబాబు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదామని అన్నారు. వ్యక్తిగతదాడులకు జగన్‌ రాజకీయ రంగు పులుముతున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దు, పోలీసులు కఠినంగా ఉండాలని తెలిపారు. తప్పులు చేసి తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు.

జగన్ హింసా రాజకీయాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుచేస్తే తప్పించుకోలేం అనే భయం కల్పిస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తెలిపారు. ప్రజలు తిరస్కరించినా జగన్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. జగన్ బెదిరింపులకు భయపడం కుట్రలను సాగనివ్వమని హెచ్చరించారు. టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్‌, నక్సలిజం, రౌడీయిజాన్ని అదుపు చేసిన చరిత్ర టీడీపీదన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తెస్తామని వెల్లడించారు.

రాజకీయ రంగు పులుముతున్నారు : 35 మంది హత్యకు గురయ్యారని చెబుతున్న జగన్ వారి వివరాలు ఇవ్వగలరా అని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. పూర్తి అవాస్తవాలను జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండ ఘటనకు జగన్ రాజకీయ రంగు పులుముతున్నారని ఆక్షేపించారు. వినుకొండ ఘటన గ్రూపుల గొడవని, రెండున్నరేళ్ల నుంచి ఆ గ్రూపుల మధ్య గొడవ జరుగుతూనే ఉందని ఆరోపించారు.

జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం : ఏపీలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు రాజకీయ హత్యల్లో తెలుగుదేశం నేతలు బాధితులుగా ఉన్నారని వాపోయారు. దిల్లీ వేదికగానే తాము కూడా జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకు జగన్ దిల్లీ నాటకం: నాగబాబు - Naga Babu Fire on Jagan Comments

శాంతి భద్రతలు ఏమీ బాగోలేవు : రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్‌ చెప్పారు. గత నెల రోజులు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుగుతున్నామని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇస్తే రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి వివరిస్తామని వెల్లడించారు.

ఫేక్​ పాలిటిక్స్ బ్రాండ్​ అంబాసిడర్​ జగన్​ - ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు - jagan fake publicity

Last Updated : Jul 20, 2024, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.