ETV Bharat / politics

ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం - CM Jagan Bus Yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 4:41 PM IST

Updated : Apr 19, 2024, 10:18 PM IST

No Response from People to CM Jagan Bus Yatra: తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర వెలవెల బోయింది. ఈ సభకు ప్రజలు స్వల్పంగా మాత్రమే హాజరయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలన ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. సామాన్యులపై పోలీసులు అత్యత్సాహం ప్రదర్శించారు.

_jagan_bus_yatra1
_jagan_bus_yatra1
ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం

No Response from People to CM Jagan Bus Yatra: సీఎం జగన్‌ బస్సు యాత్ర జనానికి తీవ్ర అవస్థలు కలిగిస్తోంది. పరీక్షలకు, ఆసుపత్రులకు వెళ్లే జనాల వాహనాలను ఆపేయడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పోలీసులు తీరుపైనా జనం మండిపడ్డారు.

బస్సు యాత్రకి జనాదరణ కరువు: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం శివారు నుంచి సీఎం జగన్​ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు చేరుకునేసరికి సీఎం జగన్ బస్సు యాత్రకి జనాదరణ కరువైంది. ఈ యాత్రలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ఆ కొంత మంది ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

'మస్తు షేడ్స్​' - ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా - సీఎం అయ్యాక మరోలా - ఎన్నికల వేళ ఇంకోలా - Jagan Election Campaign 2024

పోలీసుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు: కాకినాడ జిల్లాలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పర్యటన వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉన్నారు. వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులకు పరీక్షలు అవుతున్నాయి కాలేజ్​కు తీసుకెళ్లడానికి దారి ఇవ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్​ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు.

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు - కూటమి అభ్యర్థికి ప్రజాదరణతో మంత్రి అరాచకాలు - Tension Situations in Punganur

బలవంతంగా తరలింపు: సీఎం జగన్​ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్​ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్​ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్​ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.

జలాశయాల నిర్వహణను పట్టించుకోని జగన్​ - ఐదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS

ప్రజల పాలిట శాపంలా సీఎం జగన్ బస్సుయాత్ర - సామాన్యలపై పోలీసుల జులుం

No Response from People to CM Jagan Bus Yatra: సీఎం జగన్‌ బస్సు యాత్ర జనానికి తీవ్ర అవస్థలు కలిగిస్తోంది. పరీక్షలకు, ఆసుపత్రులకు వెళ్లే జనాల వాహనాలను ఆపేయడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పోలీసులు తీరుపైనా జనం మండిపడ్డారు.

బస్సు యాత్రకి జనాదరణ కరువు: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం శివారు నుంచి సీఎం జగన్​ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రంగంపేట మండలం వడిసలేరు చేరుకునేసరికి సీఎం జగన్ బస్సు యాత్రకి జనాదరణ కరువైంది. ఈ యాత్రలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వచ్చిన ఆ కొంత మంది ప్రజలు ఎండలో అవస్థలు పడ్డారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో రాకపోకలు సాగిస్తున్న వాహనాలను పోలీసులు నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

'మస్తు షేడ్స్​' - ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా - సీఎం అయ్యాక మరోలా - ఎన్నికల వేళ ఇంకోలా - Jagan Election Campaign 2024

పోలీసుల తీరుతో ప్రజలకు ఇబ్బందులు: కాకినాడ జిల్లాలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' పర్యటన వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటూ సామర్లకోట, పెద్దాపురంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పెద్దాపురంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ప్రధాన రహదారుల్లో వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులను గంటల తరబడి ఎండలోనే ఉన్నారు. వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన ప్రయాణికులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. విద్యార్థులకు పరీక్షలు అవుతున్నాయి కాలేజ్​కు తీసుకెళ్లడానికి దారి ఇవ్వాలంటూ అడిగిన ఆటో డ్రైవర్​ను ఓ కానిస్టేబుల్ పక్కకు నెట్టేశారు.

పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు - కూటమి అభ్యర్థికి ప్రజాదరణతో మంత్రి అరాచకాలు - Tension Situations in Punganur

బలవంతంగా తరలింపు: సీఎం జగన్​ సభలకు, దారి పొడువునా ప్రజలను పోగు చేయడానికి వైసీపీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జగన్​ బహిరంగ సభలకు జనాన్ని పార్టీ శ్రేణులు బలవంతంగా తరలిస్తుంటే, మరికొంత మంది డబ్బు, మద్యం ఆశ చూపి జనాన్ని పోగు చేస్తున్నారు. ఇంకా కొందరు అయితే జగన్​ సభలకు రాని వారిపై దాడులు కూడా చేస్తున్నారు. జగన్​ జిల్లాలో పర్యటిస్తున్నారు అంటేనే స్థానికులు భయపడుతున్నారు.

జలాశయాల నిర్వహణను పట్టించుకోని జగన్​ - ఐదేళ్లలో తొమ్మిది దుర్ఘటనలు - JAGAN NEGLECTED IRRIGATION PROJECTS

Last Updated : Apr 19, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.