ETV Bharat / politics

పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్‌- 2 రోజుల పాటు విచారించేందుకు అనుమతి - Nandigam Suresh to police custody

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 6:10 PM IST

Updated : Sep 13, 2024, 9:55 PM IST

Nandigam Suresh to Police Custody: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్‌ను పోలీస్ కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతించింది. 2 రోజుల పాటు సురేశ్‌ను విచారించేందుకు అనుమతిచ్చింది.

Nandigam Suresh to Police Custody
Nandigam Suresh to Police Custody (ETV Bharat)

Nandigam Suresh to Police Custody: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్​ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సురేష్​ను రెండు రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ మంగళగిరి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 5వ తేదీన నందిగం సురేష్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా, వైఎస్సార్సీపీ పాలనలో విచారణ ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ తీవ్రం చేశారు.

YSRCP LEADERS : అరెస్టు భయం - కోర్టు తీర్పు రావడమే ఆలస్యం, అబ్‌స్కాండ్ అయ్యారా? స్టేట్ దాటి వెళ్లారా? - YSRCP LEADERS ARREST FEAR

దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి 23 మందిని అరెస్టు చేశారు. వారిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఈనెల 5వ తేదిన సురేష్​ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కీలకంగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్​తో కలిసి కుట్ర చేసి వైఎస్సార్సీపీ మూకల్ని దాడికి పంపించినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

అందుకే నందిగం సురేష్​ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు భావించారు. గతంలో జరిగిన విచారణలో సురేష్ పోలీసులకు సహకరించలేదు. అందుకే మరోసారి విచారించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్న సురేష్​ను మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి విచారించవచ్చని చెప్పింది. ఈనెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకూ విచారించవచ్చని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. నందిగం సురేష్ న్యాయవాది గంగాధర్‌ సమక్షంలో విచారణ జరగాలని సూచించింది.

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు- సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌

Nandigam Suresh to Police Custody: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్​ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. సురేష్​ను రెండు రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ మంగళగిరి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 5వ తేదీన నందిగం సురేష్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా, వైఎస్సార్సీపీ పాలనలో విచారణ ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణ తీవ్రం చేశారు.

YSRCP LEADERS : అరెస్టు భయం - కోర్టు తీర్పు రావడమే ఆలస్యం, అబ్‌స్కాండ్ అయ్యారా? స్టేట్ దాటి వెళ్లారా? - YSRCP LEADERS ARREST FEAR

దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి 23 మందిని అరెస్టు చేశారు. వారిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఈనెల 5వ తేదిన సురేష్​ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కీలకంగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్​తో కలిసి కుట్ర చేసి వైఎస్సార్సీపీ మూకల్ని దాడికి పంపించినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి.

అందుకే నందిగం సురేష్​ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు భావించారు. గతంలో జరిగిన విచారణలో సురేష్ పోలీసులకు సహకరించలేదు. అందుకే మరోసారి విచారించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్న సురేష్​ను మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి విచారించవచ్చని చెప్పింది. ఈనెల 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 17 మధ్యాహ్నం 1 గంట వరకూ విచారించవచ్చని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. నందిగం సురేష్ న్యాయవాది గంగాధర్‌ సమక్షంలో విచారణ జరగాలని సూచించింది.

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు- సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌

Last Updated : Sep 13, 2024, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.