Minister Nara Lokesh on Jagan House Fencing : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో అవినీతి సొమ్మంతా కక్కించే రోజు దగ్గర్లోనే ఉందంటూ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. జగన్ గత ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, సాక్షి మీడియాకి ధారపోసిన వందల కోట్లు, కోట్ల రూపాయలు వెచ్చించి తిన్న ఎగ్ పఫ్లు, తాగిన నిమ్మకాయ నీళ్లన్నీ కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లి కంచె ఎత్తు ఇంకా పెంచే సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్లో గుట్టలుగా నోట్ల కట్టలు జగన్ పోగేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు (Jagan House Fencing cost 13 CR) చేసిన జగన్, మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు చేస్తుంటాడని మండిపడ్డారు.
ఐదేళ్లూ జనం సొమ్ము మేసి తాడేపల్లి ప్యాలెస్లో గుట్టలుగా నోట్ల కట్టలు పోగేసుకున్న జగన్.. చివరికి ఇంటి చుట్టూ కంచె వేసేందుకు కూడా ప్రజల సొమ్ము 13 కోట్లు ఖర్చు చేశాడు. మళ్లీ సత్య హరిశ్చంద్రుడిలా నీతి కబుర్లు, ఫేక్ ట్వీట్లు వేస్తుంటాడు. ఐదేళ్లలో దోచేసిన వేలకోట్లు, నీ సాక్షి మీడియాకి… pic.twitter.com/jPqFs5WknW
— Lokesh Nara (@naralokesh) October 15, 2024