ETV Bharat / politics

జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, జయకృష్ణ - Mandali Buddha Prasad into Janasena

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 5:30 PM IST

Mandali Buddha Prasad Joined Janasena: మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ప్రస్తుతం పిఠాపురంలో పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ సమక్షంలో వీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Mandali_Buddha_Prasad_Joined_Janasena
Mandali_Buddha_Prasad_Joined_Janasena

Mandali Buddha Prasad Joined Janasena: అవనిగడ్డ తెలుగుదేశం నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. అదే విధంగా మరో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ వెళ్లిన పవన్, తిరిగి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో గొల్లప్రోలు వచ్చారు. రోడ్డు మార్గంలో పిఠాపురంలో తాను బస చేస్తున్న గోకుల్ గోకులం గ్రాండ్ వద్దకు వచ్చారు. పవన్​కు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తాజాగా పిఠాపురంలో పవన్‌ సమక్షంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు.

Mandali Buddha Prasad Joined Janasena: అవనిగడ్డ తెలుగుదేశం నేత మండలి బుద్ధ ప్రసాద్ జనసేనలో చేరారు. అదే విధంగా మరో టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ సైతం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరికీ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ వెళ్లిన పవన్, తిరిగి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో గొల్లప్రోలు వచ్చారు. రోడ్డు మార్గంలో పిఠాపురంలో తాను బస చేస్తున్న గోకుల్ గోకులం గ్రాండ్ వద్దకు వచ్చారు. పవన్​కు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తాజాగా పిఠాపురంలో పవన్‌ సమక్షంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.