ETV Bharat / politics

గద్వాల్ ఎమ్మెల్యే యూటర్న్ - కాంగ్రెస్​ను వీడి మళ్లీ కారెక్కిన కృష్ణమోహన్ రెడ్డి - GADWAL MLA REJOINED BRS

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 1:08 PM IST

Updated : Jul 30, 2024, 2:46 PM IST

Gadwal MLA Rejoined BRS : బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే కాంగ్రెస్​లో చేరిన ఆయన మంగళవారం కేటీఆర్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు.

Etv Gadwal MLA back to BRS
Gadwal MLA Rejoined BRS (ETV Bharat)

Gadwal MLA Back to BRS : బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్​ఎస్​ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వెళ్లిన అయన మంగళవారం రోజున అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్​మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్​ను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా కేటీఆర్ ఆయణ్ను సాదరంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చే​రుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జులై 6న కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ పార్టీలో చేరిక : జులై 6న కాంగ్రెస్​లో చేరుతున్నట్లు అంతకముందే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్​ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్​ నేతలు ఆ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

పైగా గద్వాల కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై వారందరికి నచ్చజెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​లో చేరిన గద్వాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒక్కసారిగా హస్తం పార్టీకి షాక్​ ఇచ్చారు. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్​ఎస్​లో కొనసాగనున్నట్లు ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ - కాంగ్రెస్​ గూటికి చేరిన బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి - Gadwal MLA Krishna Mohan Reddy

Gadwal MLA Back to BRS : బీఆర్​ఎస్​లోనే కొనసాగనున్నట్లు గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బీఆర్​ఎస్​ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వెళ్లిన అయన మంగళవారం రోజున అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు కేసీఆర్ అపాయింట్​మెంట్ ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. తాను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేనే అన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, గులాబీ పార్టీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసీఆర్​ను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా కేటీఆర్ ఆయణ్ను సాదరంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చే​రుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జులై 6న కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ పార్టీలో చేరిక : జులై 6న కాంగ్రెస్​లో చేరుతున్నట్లు అంతకముందే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్​ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్​ నేతలు ఆ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

పైగా గద్వాల కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై వారందరికి నచ్చజెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​లో చేరిన గద్వాల బీఆర్ఎస్​ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఒక్కసారిగా హస్తం పార్టీకి షాక్​ ఇచ్చారు. తిరిగి తన సొంతగూడు అయిన బీఆర్​ఎస్​లో కొనసాగనున్నట్లు ప్రకటించారు. దీంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే జంప్ - కాంగ్రెస్​ గూటికి చేరిన బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి - Gadwal MLA Krishna Mohan Reddy

Last Updated : Jul 30, 2024, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.