CM Jagan tour : ముఖ్యమంత్రి వైయస్.జగన్ విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా గత నెల 17న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. ఏపీ సీఎం జగన్ మే నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు 2013లో బెయిల్ మంజూరు సందర్భంగా దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించజం తెలిసిందే.
విదేశాలకు జగన్- ఎన్నికల ఫలితాల వరకూ అక్కడే! - Jagan abroad tour
విదేశీ పర్యటనకు సీఎం జగన్- వీడ్కోలు పలికిన పార్టీ నేతలు - Cm Jagan tour