BRS Parliamentary Party Meeting Tomorrow : భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ రేపు సమావేశం కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ వైఖరిపై భేటీలో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర అంశాల్లో పార్టీ అనుసరించబోయే వైఖరి కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ విధానం, సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ - ఎంపీలంతా హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశాలు
ఈ సమావేశంపై ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ శుక్రవారం దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలోనే బడ్జెట్పై కేంద్రం ఎంత మేరకు సీరియస్గా ఉందో చూడాలన్న ఆయన, కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కే పరిమితం అవుతారా, పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తారా వేచి చూడాలన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఉందన్న రంజిత్ రెడ్డి, పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డినే అడగాలన్న ఆయన, ఆ తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు తనపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని, తనకు సంస్కారం ఉందని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్కు పాలన చేతకాకపోతే కేసీఆర్ను అడగండి : జగదీశ్ రెడ్డి
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు మధ్యాహ్నం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. బడ్జెట్పై కేంద్రం ఎంత మేరకు సీరియస్గా ఉందో చూడాలి. కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్కే పరిమితం అవుతారా, పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తారా వేచి చూడాలి. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తావిస్తాం. - జి.రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ
ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు : మరోవైపు ఈ నెల 27 నుంచి బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల సన్నద్ధత కోసం అసెంబ్లీ స్థాయి భేటీలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మైనార్టీ ప్రతినిధులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శనివారం సమావేశం కానున్నారు.
'కేసీఆర్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు - మా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దావా వేస్తాం'