ETV Bharat / international

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్​కు ఊరట- కాల్పుల విరమణ ఆదేశం నిలిపివేసిన కోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 8:25 PM IST

Updated : Jan 26, 2024, 10:20 PM IST

Israel Ceasefire Update : అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్​కు తాత్కాలిక ఊరట లభించింది. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన ఆదేశాన్ని నిలిపివేసింది. ఇజ్రాయెల్​పై దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇప్పుడే స్పందించలేమని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది.

Israel Ceasefire Update
Israel Ceasefire Update

Israel Ceasefire Update : నెదర్లాండ్స్‌ హేగ్‌లోని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌కు తాత్కాలిక ఊరట లభించింది. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌ను UN కోర్టు ఆదేశిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ ఆ ఆదేశాన్ని నిలిపివేసింది. అయితే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది.

గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని సృష్టిస్తోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇప్పుడే నిర్ణయాన్ని వెల్లడించలేమని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. ప్రపంచంలోని అత్యంత అపరిష్కృతమైన సంఘర్షణలలో ఒకటైన ఈ కేసులో ప్రాథమిక నిర్ణయంలో భాగంగా గాజాలో సైనిక దాడికి ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను ఆపాదించకూడదని UN అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. 17 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గాజాలో ప్రాణ నష్టం గురించి తమకు తెలుసన్న అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షులు జోన్ ఇ.డోనోగ్యు ఆ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత నిర్ణయం కేవలం మధ్యంతరమనీ దక్షిణాఫ్రికా తీసుకువచ్చిన పూర్తి కేసును పరిగణనలోకి తీసుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని పేర్కొన్నారు. గాజాలో నరమేధం చేస్తున్నట్టు తమపై దక్షిణాఫ్రికా చేస్తున్న ఆరోపణలను కొట్టివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్నిఇజ్రాయెల్ కోరింది. మరోవైపు ఈ కేసు విచారణకు వచ్చిన క్రమంలో గాజాలో పరిస్థితిని అత్యవసర అంశంగా భావించి పాలస్తీనా ప్రజల్ని కాపాడేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా కోరింది.

5నెలల శిశువు సహా 15మంది మృతి
మరోవైపు గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 15మంది మరణించారు. ఇందులో 5నెలల శిశువు సైతం ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 26,083 మంది పాలస్తీనియన్లు మరణించగా 64,487 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. గత 24 గంటల్లో 183 మంది మృతి చెందగా, 377 మంది గాయపడినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రా ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాన్ యూనిస్ నగరంలోకి మరింత చొచ్చుకుని ముందుకు వచ్చారు. శుక్రవారం పొరుగు ప్రాంతాల్లో నివసించేవారిని, ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరాన్ని తీర ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.

మారణహోమం కేసుపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని
మారణహోమం కేసుపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ స్పందించారు. దక్షిణాఫ్రికా వాదనలను 'దౌర్జన్యం' అని తిప్పికొట్టారు. దేశాన్ని, ప్రజల ప్రాణాల రక్షణకు అవసరమైన వాటిని మేము కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన మారణహోమం కేసులో గాజాలో కాల్పుల విరమణకు ఆదేశించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం నిలిపివేసింది.

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​!

ఇజ్రాయెల్​కు బిగ్ షాక్- మిలిటెంట్ దాడిలో 21 మంది సైనికులు మృతి

Israel Ceasefire Update : నెదర్లాండ్స్‌ హేగ్‌లోని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌కు తాత్కాలిక ఊరట లభించింది. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌ను UN కోర్టు ఆదేశిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ ఆ ఆదేశాన్ని నిలిపివేసింది. అయితే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది.

గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని సృష్టిస్తోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇప్పుడే నిర్ణయాన్ని వెల్లడించలేమని అంతర్జాతీయ న్యాయస్థానం తెలిపింది. ప్రపంచంలోని అత్యంత అపరిష్కృతమైన సంఘర్షణలలో ఒకటైన ఈ కేసులో ప్రాథమిక నిర్ణయంలో భాగంగా గాజాలో సైనిక దాడికి ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను ఆపాదించకూడదని UN అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. 17 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గాజాలో ప్రాణ నష్టం గురించి తమకు తెలుసన్న అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షులు జోన్ ఇ.డోనోగ్యు ఆ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుత నిర్ణయం కేవలం మధ్యంతరమనీ దక్షిణాఫ్రికా తీసుకువచ్చిన పూర్తి కేసును పరిగణనలోకి తీసుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని పేర్కొన్నారు. గాజాలో నరమేధం చేస్తున్నట్టు తమపై దక్షిణాఫ్రికా చేస్తున్న ఆరోపణలను కొట్టివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్నిఇజ్రాయెల్ కోరింది. మరోవైపు ఈ కేసు విచారణకు వచ్చిన క్రమంలో గాజాలో పరిస్థితిని అత్యవసర అంశంగా భావించి పాలస్తీనా ప్రజల్ని కాపాడేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా కోరింది.

5నెలల శిశువు సహా 15మంది మృతి
మరోవైపు గాజాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 15మంది మరణించారు. ఇందులో 5నెలల శిశువు సైతం ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 26,083 మంది పాలస్తీనియన్లు మరణించగా 64,487 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. గత 24 గంటల్లో 183 మంది మృతి చెందగా, 377 మంది గాయపడినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్-ఖిద్రా ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాన్ యూనిస్ నగరంలోకి మరింత చొచ్చుకుని ముందుకు వచ్చారు. శుక్రవారం పొరుగు ప్రాంతాల్లో నివసించేవారిని, ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరాన్ని తీర ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది.

మారణహోమం కేసుపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని
మారణహోమం కేసుపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ స్పందించారు. దక్షిణాఫ్రికా వాదనలను 'దౌర్జన్యం' అని తిప్పికొట్టారు. దేశాన్ని, ప్రజల ప్రాణాల రక్షణకు అవసరమైన వాటిని మేము కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా దాఖలు చేసిన మారణహోమం కేసులో గాజాలో కాల్పుల విరమణకు ఆదేశించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం నిలిపివేసింది.

ఇరాన్‌కు చైనా వార్నింగ్- నౌకలపై దాడులు ఆపకపోతే వ్యాపార సంబంధాలు కట్​!

ఇజ్రాయెల్​కు బిగ్ షాక్- మిలిటెంట్ దాడిలో 21 మంది సైనికులు మృతి

Last Updated : Jan 26, 2024, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.