ETV Bharat / bharat

UPSC కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరదనీరు- దిల్లీలో ముగ్గురు సివిల్స్​ ఆశావహులు మృతి - Delhi UPSC Coaching Center Incident

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 6:31 AM IST

Updated : Jul 28, 2024, 7:07 AM IST

Delhi UPSC Coaching Center Incident : భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్​లోకి వరద నీరు వచ్చి చేరడం వల్ల ముగ్గురు అశావహులు మరణించారు. వారిలో ఇద్దరు మహిళ అభ్యర్థులు ఉన్నారు.

Delhi UPSC Coaching Center Incident
Delhi UPSC Coaching Center Incident (ETV bharat)

Delhi UPSC Coaching Center Incident : భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్​ బేస్​మెంట్​లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం సాయంత్రం ఓల్ట్ రాజిందర్ నగర్​లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్​ బేస్​మెంట్​లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పొటెత్తడం వల్ల భవనం అడుగు భాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్​ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, ​అప్పటికే బెస్​మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్​డీఆర్​ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

విద్యార్థలు ఆందోళనలు
మరోవైపు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్​ సెంటర్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. '10 నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుంది. గత 12 రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయాలని కౌన్సిలర్​ను కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నానని అన్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎన్​డీఆర్​ఎఫ్​ వాళ్లు 8-10మంది వరకు చనిపోయారని అంటున్నారు. మృతుల సంఖ్య, ఎంతమంది గాయపడ్డారో మాకు తెలియజేయాలి' విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మేజిస్టీరియల్​ విచారణకు ఆదేశం
ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని దిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని ఎక్స్ వేదికగా అతిశీ పేర్కొన్నారు.

ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
ఘటనాస్థలిని సందర్శించిన దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవా, ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్​ పాలనపై విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీలను శుభ్రం చేయించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యత వహించి మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నారు. ఇంకా 18మంది చిక్కుకొని ఉంటారని, కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని బీజేపీ నేత మంజీందర్ సిర్సా పేర్కొన్నారు.

పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్​- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా! - Sister Molested And Murder

వికసిత్ భారత్@2047 ప్రతి భారతీయుడి ఆశయం: మోదీ - NITI Aayog Meeting 2024

Delhi UPSC Coaching Center Incident : భారీ వర్షం కారణంగా సెంట్రల్ దిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్​ బేస్​మెంట్​లోకి వచ్చిన వరద నీరు వల్ల ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం సాయంత్రం ఓల్ట్ రాజిందర్ నగర్​లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్​ బేస్​మెంట్​లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పొటెత్తడం వల్ల భవనం అడుగు భాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్​ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని దిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి వెళ్లామని, ​అప్పటికే బెస్​మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. దిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్​డీఆర్​ఎఫ్, స్థానికల పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దిల్లీ పోలీసులు ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

విద్యార్థలు ఆందోళనలు
మరోవైపు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మృతికి నిరసనగా విద్యార్థలు కోచింగ్​ సెంటర్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. '10 నిమిషాల పాటు వర్షం కురిసినా ఇక్కడ నీరు నిలిచిపోతుంది. గత 12 రోజులుగా డ్రైనేజీని శుభ్రం చేయాలని కౌన్సిలర్​ను కోచింగ్ సెంటర్ యజమాని అడుగుతున్నానని అన్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎన్​డీఆర్​ఎఫ్​ వాళ్లు 8-10మంది వరకు చనిపోయారని అంటున్నారు. మృతుల సంఖ్య, ఎంతమంది గాయపడ్డారో మాకు తెలియజేయాలి' విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

మేజిస్టీరియల్​ విచారణకు ఆదేశం
ఈ ఘటనపై 24 గంటల్లోగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని దిల్లీ రెవెన్యూ మంత్రి అతిశీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో తెలుసుకునేందుకు మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని ఎక్స్ వేదికగా అతిశీ పేర్కొన్నారు.

ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
ఘటనాస్థలిని సందర్శించిన దిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్​దేవా, ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్​ పాలనపై విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీలను శుభ్రం చేయించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యత వహించి మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నారు. ఇంకా 18మంది చిక్కుకొని ఉంటారని, కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని బీజేపీ నేత మంజీందర్ సిర్సా పేర్కొన్నారు.

పోర్న్ వీడియోస్ చూసి సొంత చెల్లిపై రేప్​- ఆపై గొంతు నులిమి హత్య- తల్లి కళ్ల ముందే జరిగినా! - Sister Molested And Murder

వికసిత్ భారత్@2047 ప్రతి భారతీయుడి ఆశయం: మోదీ - NITI Aayog Meeting 2024

Last Updated : Jul 28, 2024, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.