వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా బజాయించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలను సూచించారు. 151 సీట్లు గెలుచుకున్న వైకాపా 15 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని పవన్ వ్యాఖ్యానించారు.