తెలంగాణ

telangana

Teneti Vindu At President Home in Hyderabad

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్​ హోం కార్యక్రమం - హాజరైన ప్రముఖులు

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2023, 8:04 PM IST

Published : Dec 22, 2023, 8:04 PM IST

ETV Bharat / videos

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్​ హోం కార్యక్రమం - హాజరైన ప్రముఖులు

Teneti Vindu At President Home in Hyderabad :హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. శీతాకాలం విడిది కోసం హైదరాబాద్​ వచ్చిన రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే దంపతులు కూడా పాల్గొన్నారు. 

Teneti Vindu At President Home in Hyderabad : మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీఎస్ శాంతికుమారి తదితరులు రాష్ట్రపతి ఎట్ హోంకు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతి ఒక్కరిని కలిశారు. అందరు కలసి కాసేపు మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు.   

ABOUT THE AUTHOR

...view details