తెలంగాణ

telangana

కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి- రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనట!

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 5:03 PM IST

Gaura Puja Bhupesh Baghel 2023

Chhattisgarh CM Gaura Gauri Puja :ఛత్తీస్​గఢ్​ ప్రజల శ్రేయస్సు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​.. కొరడా దెబ్బలు తిన్నారు. దుర్గ్​ జిల్లాలోని జాంజ్​గీర్​ గ్రామంలో ఘనంగా జరిగిన 'గౌరా గౌరీ' పూజకు హాజరైన బఘేల్​.. ఆచారంలో భాగంగా కొరడా ఝులిపించుకున్నారు. ఆ సమయంలో అక్కడికి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ఈ పని చేసినట్లు సీఎం బఘేల్​ తెలిపారు. "శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. 'గౌరా గౌరీను ప్రజలంతా కలిసి తయారు చేస్తారు. ఉదయాన్నే పూజిస్తారు. గౌరా గౌరీ ముందు అందరూ సమానమే. ఈ పండుగ సమానత్వాన్ని సూచిస్తుంది" అని బఘేల్​ తెలిపారు.
దీపావళి పండుగ సమయంలో గోండు తెగ ప్రజలు ఈ పూజను నిర్వహిస్తారు. మొదట నది ఒడ్డుకు వెళ్లి మట్టిని సేకరిస్తారు. అదే రోజు రాత్రి ఒకరి ఇంట్లో శివుడిని.. మరొకరి ఇంట్లో పార్వతీ దేవిని తయారు చేస్తారు. అనంతరం శివపార్వతుల కల్యాణ జరుపుతారు.

ఛత్తీస్​గఢ్​లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు ఉండగా.. నవంబర్​ 7వ తేదీన 20 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలి 70 స్థానాలకు నవంబర్​ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details