లాక్డౌన్ వేళ జనావాసాల్లోకి అడవి మృగాలు!
కరోనా కారణంగా ఇటలీలో లాక్డౌన్ అమల్లో ఉంది. ప్రజలు బయట తిరగడం నిషేధం. ఈ నేపథ్యంలో అడవి మృగాలు రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మొల్వెనో ప్రాంతంలోని వీధుల్లో ఓ ఎలుగుబంటి రాత్రిపూట సంచరిస్తూ కనిపించింది. అయితే.. ఆహారం కోసమే ఇలా జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు. ఇటీవలి కాలంలో జింకలు, దుప్పులు, నక్కలు కూడా రోడ్లపై సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.