తెలంగాణ

telangana

ఆ కమాండోలకు బ్యాండ్​ బాజాతో స్వాగతం

By

Published : May 22, 2021, 1:39 PM IST

మహారాష్ట్ర గడ్చిరోలి కొట్మీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న సీ-60 కమాండోలకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఘన స్వాగతం లభించింది. బ్యాండ్‌ బాజాలతో వారికి భద్రతా దళాలు స్వాగతం పలికాయి. సీ-60 కమాండోలపై పూలు, స్ప్రే చల్లి ఆహ్వానం పలికాయి. ఉన్నతాధికారులు చప్పట్లు కొడుతూ కమాండోలను అభినందించారు. నిన్న ఉదయం ఎటపల్లి పరిధిలోని కొట్మీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది నక్సల్స్‌ చనిపోయారు. మిగిలిన నక్సల్స్‌ అడవిలోకి పారిపోయారని డీఐజీ సందీప్‌ పాటిల్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details