తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదవశాత్తు బావిలో పడి అన్నదమ్ములు మృతి

వ్యవసాయ పనులకని పొలానికి వెళ్లిన అన్నదమ్ములు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ అన్నను కాపాడేందుకు ప్రయత్నించి తమ్ముడు కూడా మృత్యువు ఒడిలో ఒదిగిపోయాడు.

By

Published : Jun 25, 2019, 10:22 PM IST

TWO BROTHERS DIED DUE TO ACCIDENTALLY FELL IN WELL

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో విషాదం నెలకొంది. శివకృష్ణ, రాము అనే అన్నదమ్ములు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. వ్యవసాయక్షేత్రంలో నడుస్తూ వెళ్తున్న క్రమంలో శివకృష్ణ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అన్నను రక్షించే ప్రయత్నంలో రాము బావిలో దిగాడు. కానీ... అన్నతో పాటు రాము కూడా బావిలోనే మరణించాడు. అన్నదమ్ములిద్దరూ చనిపోవటం... గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అన్నదమ్ములు మృతి

ABOUT THE AUTHOR

...view details