తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న బైక్​.. యువకుడు మృతి

శుక్రవారం అర్థరాత్రి యాదాద్రి జిల్లా టేకులసోమారం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అనాజీపురం గ్రామానికి చెందిన వేణు  దుర్మరణం చెందాడు.

By

Published : Jun 8, 2019, 12:40 PM IST

యువకుడు మృతి

ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొనడం వల్ల ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెపల్లి వేణు కొండల్​గా గుర్తించారు. వలిగొండ నుంచి అనాజీపురానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బలకృష్ణా రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

యువకుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details