తెలంగాణ

telangana

ETV Bharat / state

బూడిదైన రూ.40 లక్షల పత్తి

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా యాదాద్రి జిల్లాలోని నారాయణపురం స్పిన్నింగ్ మిల్లులో  40 లక్షల రూపాయల విలువైన  పత్తి అగ్నికి ఆహుతైంది.

By

Published : Feb 19, 2019, 2:24 PM IST

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

నారాయణపురం స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వెంకబావి తండా సమీపంలోని నారాయణపురం స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మిల్లులో మంటలు చెలరేగి పత్తి కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. సుమారుగా రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details