తెలంగాణ

telangana

ETV Bharat / state

YADADRI: పాతగుట్టలో కొనసాగుతున్న నూతన ముఖద్వారం బిగింపు పనులు

యాదాద్రి పాతగుట్టలో గర్భాలయానికి నూతన ముఖద్వారం బిగింపు పనులు చేపట్టారు. గర్భాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణమూర్తుల దర్శనం సంపూర్ణంగా కావడంలేదని, ఇందుకు ముఖద్వారాన్ని విస్తరించాలని యాదాద్రి దేవస్థానం నిర్ణయించిన విషయం తెలిసిందే.

By

Published : Jul 8, 2021, 12:09 AM IST

YADADRI: పాతగుట్టలో కొనసాగుతున్న నూతన ముఖద్వారం బిగింపు పనులు
YADADRI: పాతగుట్టలో కొనసాగుతున్న నూతన ముఖద్వారం బిగింపు పనులు

యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్టలో గర్భాలయానికి నూతన ముఖద్వారం బిగింపు పనులు చేపట్టారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు ముఖద్వారానికి ప్రతిష్ట పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ వైస్​ఛైర్మన్​ కిషన్​రావు, ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. గర్భాలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణమూర్తుల దర్శనం సంపూర్ణంగా కావడంలేదని, ఇందుకు ముఖద్వారాన్ని విస్తరించాలని యాదాద్రి దేవస్థానం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందుకు ఈనెల 4న ద్వారం తొలగింపునకు పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో నూతన ముఖద్వారం బిగింపు పనులు చేపట్టారు. విస్తరణ పనుల దృష్ట్యా ఈనెల 6 నుంచి 10 వరకు మూలవర్యుల దర్శనం నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా ముఖ మండపంలో కవచమూర్తుల దర్శనాలను కొనసాగించనున్నట్లు ఈవో గీత తెలిపారు.

పూజలు చేస్తున్న ఆలయ ఈవో

ఆకర్షణీయంగా ఆళ్వారుల రూపాలు

యాదాద్రి పంచ నారసింహ స్వామి సన్నిధానంలోని మహా ముఖ మండపంలో కృష్ణశిలతో రూపొందిన ఆళ్వారుల విగ్రహాలకు సరికొత్త విద్యుత్ వెలుగులను అమర్చే పనులు జరుగుతున్నాయి. ఆ దశలో పోయిగై ఆళ్వార్ విగ్రహానికి గంట రూపంలోని విద్యుత్ దీపాన్ని బుధవారం మరోసారి అలంకరించి పరిశీలించారు. మిగతా ఆళ్వారుల విగ్రహాలకు గురువారం నుంచి ఏర్పాట్లు చేపడతామని ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి తెలిపారు.

ఆకర్షణీయంగా ఆళ్వారుల రూపాలు

ఇదీ చదవండి: Palle pragathi: ఆ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details