యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో రోజురోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని పాత హైస్కూల్ స్థలం ఆవరణలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో యాదాద్రి పీహెచ్సీ వైద్య బృందం పట్టణ ప్రజలకు ఉచితంగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. 93 మందికి పరీక్షలు చేయగా.. 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
తాజా కేసుల్లో యాదగిరిగుట్టలో 6, యాదగిరిపల్లిలో 1, గుండ్లపల్లిలో 2, మాసాయిపేటలో 2, మల్లపురంలో 1, గౌరాయిపల్లిలో 1, వడాయిగూడెంలో 2 కేసులు నమోదయ్యాయి.